
వైద్యుల కొరతతో రోగుల అవస్థలు మరమ్మతులు లేక మూలనపడ్డ కోట్ల విలువ చేసే యంత్రాలు కమీషన్ల కక్కుర్తితో ప్రైవేటు ఆస్పత్రులకు తరలిస్తున్న సిబ్బంది 8 నెలలుగా నిలిచిన న్యూరో సర్జరీలు న్యూరో సర్జరీలో ఒకే ఒక్క వైద్యుడు వరంగల్ మెడికల్: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రితోపాటు సూపర్ స్పెషా లిటీ ఆస్పత్రిలో న్యూరో కేర్.. డోంట్ కేర్.. అన్న చందంగా మారింది. రోడ్డు ప్రమాదాలు, న్యూరో సం బంధిత జబ్బులతో చావు బతుకుల మధ్య నిత్యం రోగులు వస్తుంటారు. కానీ చికిత్స అందించే వైద్యు లే కరువయ్యారు. న్యూరో విభాగంలో న్యూరో ఫిజీ షియన్ సేవలు, న్యూరో సర్జరీ సేవల కోసం ప్రత్యే క వార్డులను వైద్యులను ఏర్పాటు చేశారు. కానీ రోగుల సంఖ్యకనుగుణంగా వైద్యులు లేకపోవడం వల్ల సేవలు నిల్గా మారాయి. ఎనిమిది నెలలుగా న్యూరో సర్జరీలు బంద్ కావడమే ఎందుకు నిలువె త్తు సాక్ష్యం. సర్జరీ విభాగంలో ఒకే ఒక రెగ్యులర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ సేవలు అందిస్తున్నారు. మరో కాంట్రాక్ట్ వైద్యుడు కూడా కొనసాగుతున్నారు. ఒక్క వైద్యులు ఎంతమందికి శస్త్ర చికిత్స చేయగలరు ఉన్నతాధికారులకే తెలియాల్సి ఉంటుంది. రోగుల తాకిడి ఎక్కువ న్యూరో విభాగంలో ఒక నెలలో 4 వేలకు పైగా ఓపీ ఉంటుందని గణాంకాల ద్వారా తెలుస్తోంది. కానీ ఓపీ చూసేందుకు కూడా వైద్యులు లేక రోగు లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గంటల తరబడి నిరీక్షించిన న్యూరో సర్జరీ, న్యూరో ఫిజీషి యన్లను రోగులు కలవలేక తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చేవారి బాధ వర్ణనాతీతంగా మారింది. న్యూరో విభాగంలో అత్యవసరంగా శస్త్ర చికిత్స అవసరం ఉన్న రోగులకు దేవుడే దిక్కు అన్న విధంగా మారింది. నిత్యం 10 నుంచి 15 మంది రోడ్డు ప్రమాదాలల్లో తలకు గాయాలు, స్పైన్ సర్జరీలు, ట్రామా లాంటి మెడికో లీగల్ కేసులు ఎంజీఎం సూపర్ స్పెషాలిటీకి వస్తుంటాయి. ఉమ్మడి