
టీమిండియా యువ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి వరుస గాయాలపై బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్(సీఓఈ) హెడ్, మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ స్పందించాడు. ఆల్రౌండర్గా నితీశ్పై అధికంగా ఉండే వర్క్లోడ్ను ఎలా సమర్థంగా నిర్వహించాలో అతడితో చర్చిస్తున్నామని చెప్పాడు. ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా యువ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి వరుస గాయాలపై బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్(సీఓఈ) హెడ్, మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ స్పందించాడు. ఆల్రౌండర్గా నితీశ్పై అధికంగా ఉండే వర్క్లోడ్ను ఎలా సమర్థంగా నిర్వహించాలో అతడితో చర్చిస్తున్నామని చెప్పాడు. గాయాలు ఆటలో భాగమేనని, అయితే వాటి నుంచి త్వరగా కోలుకునేందుకు ఆటగాళ్లు తమ ఫిట్నెస్ను మెరుగ్గా నిర్వహించుకోవాలని సూచించాడు. ఇటీవల పలువురు భారత ఆటగాళ్లు గాయాలతో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా సీఓఈని సందర్శించారు. అక్కడ కొనసాగుతున్న రిహాబిలిటేషన్, ఇంజూరీ మేనేజ్మెంట్ను సమీక్షించారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో లక్ష్మణ్ నితీశ్ విషయంలో సీఓఈ అనుసరిస్తున్న విధానాన్ని వివరించాడు. నితీశ్ ఇటీవల తొడ కండరాల గాయానికి గురయ్యాడు. దీంతో ఐర్లాండ్, ఇంగ్లండ్, జింబాబ్వే సిరీస్లకు అతడు దూరమైన సంగతి తెలిసిందే. ‘ఆల్రౌండర్గా నితీశ్పై ఎక్కువ వర్క్లోడ్ ఉంటుంది. మ్యాచ్లు ఆడుతున్న సమయంలోనే కాకుండా, జట్టులో లేని విరామ సమయాల్లోనూ ఫిట్నెస్పై దృష్టి పెట్టాలి. గాయాలు ఆటలో భాగమే. అయితే ఆల్రౌండర్గా తనపై ఉన్న భారాన్ని ఎలా సమర్థంగా నిర్వహించుకోవాలో అతడు తెలుసుకోవాలి. ప్రస్తుతం క్రికెట్లో ప్లేయర్లకు పెద్దగా ఆఫ్-సీజన్ ఉండటం లేదు. ఐపీఎల్, రాష్ట్ర జట్టు తరఫున క్రికెట్ ఆడటం, దేశవాళీ టోర్నీలు, అంతర్జాతీయ మ్యాచ్లతో ఆటగాళ్లు బిజీగా ఉంటున్నారు. అందువల్ల మ్యాచ్ల మధ్య లభించే స్వల్ప విరామాలను ఫిట్నెస్ మెరుగుపర్చుకునేందుకు సమర్థంగా వినియోగించుకోవాలి’ అని లక్ష్మణ్ సూచించాడు. సీజన్కు ముందు ప్రత్యేక ఫిట్నెస్ పరీక్షలు.. సీజన్ ప్రారంభానికి ముందు కాంట్రాక్ట్ ఆటగాళ్లతో పాటు భవిష్యత్తులో జట్టుకు ఎంపికయ్యే క్రికెటర్లకు పలు ఫిట్నెస్