
క్రికెట్లో కొన్ని సంఘటనలు మ్యాచ్ ఫలితాన్ని మించి అభిమానుల జ్ఞాపకాల్లో నిలిచిపోతాయి. అలాంటి సంఘటనే 2010 ఆగస్టు 16న శ్రీలంకలోని దంబుల్లాలో జరిగిన భారత్-శ్రీలంక వన్డేలో చోటుచేసుకుంది. ఆ మ్యాచ్లో టీమిండియా ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ 99 పరుగులతో నాటౌట్గా నిలిచిపోయాడు. మ్యాచ్ గెలవడానికి భారత్కు ఒక్క పరుగు మాత్రమే అవసరం కాగా, శ్రీలంక ఆఫ్ స్పిన్నర్ సూరజ్ రందీవ్ వేసిన నోబాల్ కారణంగా సెహ్వాగ్ సెంచరీ మిస్ అయ్యింది. శ్రీలంక తొలుత బ్యాటింగ్ చేసి 46.1 ఓవర్లలో 170 పరుగులకు ఆలౌటైంది. భారత్ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సెహ్వాగ్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. 100 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 99 పరుగులకు చేరుకున్నాడు. భారత్ స్కోరు 170 వద్ద ఉండగా, జట్టు విజయానికి ఒక్క పరుగు మాత్రమే కావాల్సి వచ్చింది. మరోవైపు సెహ్వాగ్కు కూడా సెంచరీకి ఒక్క పరుగు అవసరం. అలాంటి సమయంలో సూరజ్ రందీవ్ బంతి వేయడానికి ముందే క్రీజ్ దాటి నోబాల్ వేశాడు. అంపైర్ నోబాల్ ప్రకటించడంతో భారత్కు అదనంగా ఒక పరుగు లభించింది. దీంతో మ్యాచ్ అక్కడే ముగిసిపోయింది. సెహ్వాగ్ ఆ బంతిని భారీ సిక్సర్గా కొట్టినా, నోబాల్తోనే భారత్ విజయ పరుగు పూర్తయినందున ఆ షాట్ స్కోరులో చేరలేదు. ఫలితంగా సెహ్వాగ్ 99 పరుగులతోనే నాటౌట్గా నిలిచిపోయాడు. ఈ సంఘటనపై వెంటనే తీవ్ర వివాదం చెలరేగింది. సెహ్వాగ్ మ్యాచ్ అనంతరం నోబాల్ కావాలనే వేసినట్లుగా భావిస్తున్నానని చెప్పాడు. స్పిన్నర్ అయినప్పకీ చాలా ముందుకు వచ్చి ఉద్దేశపూర్వకంగా నో బాల్ వేసినట్లు విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో రందీవ్ సెహ్వాగ్కు క్షమాపణలు కూడా చెప్పాడు. శ్రీలంక క్రికెట్ అధికారులు కూడా ఈ ఘటనపై స్పందించారు. అప్పటి శ్రీలంక జట్టు సహచరుడు తిలకరత్నే దిల్షాన్ రందీవ్ను నోబాల్ వేయమని ప్రోత్సహించినట్లు కూడా ఆరోపణలు వచ్చాయి. ఈ వివాదాన్ని శ్రీలంక క్రికెట్ తీవ్రంగా పరిగణించింది. సూరజ్ రందీవ్కు మ్యాచ్ ఫీజులో