
ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2027 కౌంట్డౌన్ అధికారికంగా ప్రారంభమైంది. సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియాల్లోని 12 స్టేడియాల్లో ఈ మెగా టోర్నీ జరగనుంది. వీటికి సంబంధించిన స్టేడియాలను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఇటీవల ప్రకటించింది. 24 ఏళ్ల విరామం తర్వాత 50 ఓవర్ల క్రికెట్ ప్రపంచకప్ ఆఫ్రికా ఖండానికి తిరిగి వస్తోంది. దాంతో ఈ టోర్నీపై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానుల్లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఈ 2027 క్రికెట్ వరల్డ్ కప్లో మొత్తం 14 జట్లు పోటీపడనున్నాయి. కొత్త టోర్నమెంట్ ఫార్మాట్ కింద మొత్తం 57 మ్యాచ్లు జరగనున్నాయి. అత్యధిక మ్యాచ్లకు సౌతాఫ్రికా ఆతిథ్యం ఇస్తుండగా, మిగిలిన కొన్ని మ్యాచ్లను జింబాబ్వే, నమీబియా దేశాలు నిర్వహించనున్నాయి. ఈ మెగా టోర్నమెంట్ కోసం భారత క్రికెట్ జట్టు ఇప్పటి నుంచే తమ ప్రిపరేషన్స్ షురూ చేసింది. కొత్త కెప్టెన్ శుభ్మన్ గిల్ సారథ్యంలో ఒక బలమైన వన్డే జట్టును నిర్మించే పనిలో బోర్డు ఉంది. అయితే, క్రికెట్ అభిమానుల దృష్టి మాత్రం స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపైనే ఉంది. 2027 ప్రపంచకప్లో విరాట్ కోహ్లీ ఆడాలని కోట్లాది మంది క్రికెట్ లవర్స్ కోరుకుంటున్నారు. ఒకవేళ విరాట్ కోహ్లీ ఈ టోర్నీ ఆడితే, అది ఐసీసీ టోర్నమెంట్లో అతడికి ఆఖరి మ్యాచ్ లు అయ్యే అవకాశం ఉంది. ఈ దిగ్గజ ప్లేయర్ను మరోసారి వరల్డ్ కప్ లో చూడాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విరాట్ కోహ్లీ కూడా తన అత్యుత్తమ ప్రదర్శనల ద్వారా 2027 వన్డే వరల్డ్ కప్యే తన తదుపరి ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశాడు. ఇటీవల వన్డేల్లో కోహ్లీ ఫామ్, సౌతాఫ్రికాలో అతనికి ఉన్న అద్భుతమైన రికార్డులు ఈ అంచనాలను మరింత పెంచేశాయి. సౌతాఫ్రికా మైదానాల్లో బ్యాటింగ్ చేయడం అంటే విరాట్ కోహ్లీకి చాలా ఇష్టం. 2027 వరల్డ్ కప్ కోసం ఎంపిక చేసిన 12