
తమిళ వర్సటైల్ యాక్టర్ విక్రమ్ కొడుకు ధృవ్ విక్రమ్ ఆయన పరువును తీయడానికే కంకణం కట్టుకున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇండస్ట్రీలో ఏ వారసుడు తీసుకురాని వివాదాలను ధృవ్ తెచ్చిపెడుతున్నాడు. తమిళ వర్సటైల్ యాక్టర్ విక్రమ్ (Vikram) కొడుకు ధృవ్ విక్రమ్ (Dhruv Vikram) ఆయన పరువును తీయడానికే కంకణం కట్టుకున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇండస్ట్రీలో ఏ వారసుడు తీసుకురాని వివాదాలను ధృవ్ తెచ్చిపెడుతున్నాడు. హీరోగా లాంచ్ అయిన దగ్గర నుంచి ఈ కుర్రాడు చేసినవి కొన్ని సినిమాలే అయినా, వివాదాలు మాత్రం లెక్కలేనన్ని ఎదుర్కొంటున్నాడు. ఇక ఈమధ్య నటి అనుపమ పరమేశ్వరన్తో బ్రేకప్, ధృవ్ ఎంత టాక్సిక్ అని ఆమె చెప్పిన విధానం ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసింది. ఇటీవలే ఈ బ్రేకప్ విషయంపై ధృవ్ స్పందిస్తూ.. ప్రేమించిన వారికి బలం ఇవ్వాలి, ట్రోల్స్ వలన నేను కూడా బాధపడ్డాను అని చెప్పాడు. అయితే ఈ వివాదం ముగియకముందే, సినిమా చేస్తానని చెప్పి డబ్బులు తీసుకుని నిర్మాతలను మోసం చేశాడంటూ మరో వివాదం రగులుకుంది. ఇది పాతదే అయినా మరోసారి వైరల్ గా మారింది. గతంలో ధృవ్ విక్రమ్పై తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ లో నీలాద్రి ప్రొడక్షన్స్, పెన్ స్టూడియోస్ సంయుక్తంగా ఫిర్యాదు చేసిన విషయం తెల్సిందే. డైరెక్టర్ రమేష్ వర్మ దర్శకత్వంలో ధృవ్తో ఒక సినిమా ఓకే చేసి.. రూ. 1 కోటి అడ్వాన్స్ తీసుకున్నాడు. దీంతో మేకర్స్ పాటలు, సెట్లు, నటీనటుల ముందస్తు ఖర్చుల కోసం నిర్మాతలు భారీగా డబ్బులు వెచ్చించారు. కానీ షూటింగ్ ప్రారంభమయ్యే సమయానికి తమకు చెప్పకుండా ధృవ్ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో కరణ్ దర్శకత్వంలో ఓ సినిమాను #DV4 గా అనౌన్స్ చేశాడు. లెక్క ప్రకారం రమేష్ వర్మతో చేయాల్సిన చిత్రమే #DV4 కావాలని, మైత్రీ మూవీస్ ప్రాజెక్ట్ #DV5 అవ్వాలని నిర్మాతలు స్పష్టం చేశారు. ఇక ఈ విషయంపై