© 2026 nimisham.in

ఏపీ రాజకీయాల్లో గతంలో యాక్టివ్ గా ఉండి, వైసీపీ ఎంపీ, పార్లమెంటరీ పార్టీ నేతగా కూడా పనిచేసిన విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) ఆ తర్వాత ఆ పార్టీ అధికారం కోల్పోగానే రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు. అనంతరం బీజేపీలోకి వెళ్లేందుకు ప్రయత్నించి .. అది కూడా సాధ్యం కాక తిరిగి రాజకీయాల్లో సొంత పార్టీ ద్వారా ఎంట్రీ ఇచ్చేందుకు సాయిరెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సాధ్యమైనంత ఎక్కువ తనపై అటెన్షన్ ఉండేలా చూసుకుంటున్నారు.UPI పేమెంట్స్ పై ఛార్జీలు ? కేంద్రానికి సాయిరెడ్డి హెచ్చరికలు..!ఇదే క్రమంలో ఆయన ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా ఉన్న జెన్ జీ(Gen Z)పై సానుభూతి ప్రదర్శించాల్సిన అవసరం ఉందంటూ ఓ ట్వీట్ చేశారు. ఇందుకు గల కారణాలను కూడా విజయసాయిరెడ్డి తన ట్వీట్ లో వెల్లడించారు. ఈ సందర్భంగా సాధారణంగా చర్చకు రాని పలు విషయాన్ని కూడా సాయిరెడ్డి బయటపెట్టారు. ఆయా కారణాలతో వారి మాటల్ని సానుభూతితో వినాల్సిన అవసరం ఉందని మాజీ ఎంపీ తేల్చేశారు. 2.5 లక్షలకు PPF లిమిట్ ?- ఆర్థికమంత్రికి సాయిరెడ్డి కీలక ప్రతిపాదన..!మనం మన Gen Z మాటలను సానుభూతితో వినాలని సాయిరెడ్డి కోరారు. వారు అనిశ్చిత ఉద్యోగాలు, అందుబాటులో లేని ఇళ్లు, క్షీణిస్తున్న పర్యావరణం, కొరతగా ఉన్న వనరులు, ఉమ్మడి కుటుంబం, స్నేహం వంటి బలహీనపడుతున్న మద్దతు వ్యవస్థలతో కూడిన ప్రపంచాన్ని వారసత్వంగా పొందుతున్నారని సాయిరెడ్డి తెలిపారు. వారికి ఆశ, అవకాశాలు, వారి ఆందోళనలను తీవ్రంగా పరిగణించే విధానకర్తలు అవసరమన్నారు. తాను ఆ గొంతుకలలో ఒకటిగా ఉండాలని కోరుకుంటున్నానని తన మనసులో మాటను కూడా సాయిరెడ్డి బయటపెట్టేశారు. తద్వారా తనను తాను జెన్ జీకి మద్దతుదారుడినని చెప్పుకునే ప్రయత్నం చేశారు
.