© 2026 nimisham.in

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్, లైఫ్స్టైల్, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది. Indonesia Earthquake Videos: ఇండోనేషియాలోని ఫ్లోరోసెస్ ప్రాంతంలో మరోసారి భారీ భూకంపం సంభవించింది. ఇది రిక్టార్ స్కేల్ పై 7.7 గా నమోదయింది. నిమిషాల వ్యవధిలో మూడుసార్లు భూమి కంపించడంతో ఆ ప్రాంత ప్రజలు భయాందోళనతో పరుగులు తీశారు. వాతావరణ శాఖ ముందస్తు సునామీ హెచ్చరికలు జారీ చేసింది. భూకంపం కారణంగా భవనాలు ఊగిపోయాయి. అయితే, ఇప్పటి వరకు ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టంపై వివరాలు బయటకు రాలేదు. ఇటీవల కొలంబియాలో సంభవించిన భూకంపంలో 225 మంది మరణించిన సంగతి తెలిసిందే, తాజాగా ఇండోనేషియాలో భూకంప తీవ్రత పెరగడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. యూరోపియన్ మెడిట్రియన్ సిస్మోలాజికల్ సెంటర్ ప్రకారం, ఈ భూకంప కేంద్రం నీటి అడుగున సుమారు 35 కిలోమీటర్ల లోతులో ఉంది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 4:58 గంటలకు ఈ భూకంపం సంభవించింది. అధికారులు ప్రజలకు సునామీ హెచ్చరికలు జారీ చేసి, ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలు నిరంతరం తనిఖీలు చేస్తున్నాయి. అయితే, ఆస్ట్రేలియా ప్రధాన భూభాగం, ద్వీపాలు లేదా ఇతర ప్రాంతాలకు ఎలాంటి సునామీ ముప్పు లేదని ఆస్ట్రేలియా సంస్థ పేర్కొంది. ఇండోనేషియాలోని ప్రజలంతా రోడ్లపైకి వచ్చి, పిల్లలతో సహా సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఉదయం సమయంలో ఒక్కసారిగా భూకంపం సంభవించడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. భూకంపం సముద్ర గర్భంలో సంభవించినందున, భూభాగంపై దాని ప్రభావం ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఇండోనేషియా పసిఫిక్ సముద్ర ప్రాంతంలో అగ్నిపర్వతాలు, ఫాల్ట్ లైన్ల ప్రభావం వల్ల ఇక్కడ నిరంతరం భూకంపాలు, అగ్నిపర్వత కార్యకలాపాలు జరుగుతుంటాయి. ఈ
భూకంపం కారణంగా తూర్పు, దక్షిణ సులవేసి, పశ్చిమ న్యూ గైనియా ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. భూభౌతిక శాస్త్రం, శీతోష్ణస్థితి ఆధారంగా సునామీ వచ్చే అవకాశం ఉందని డైరెక్టర్ ప్రకటనలో తెలిపారు. స్థానికులు మాట్లాడుతూ, ఉదయం సమయంలో ఒక్కసారిగా భూమి కంపించడంతో తమ పిల్లలతో కలిసి వెంటనే రోడ్లపైకి పరుగులు తీశామని చెప్పారు. చాలామంది ఇళ్లను వదిలి కొండల వైపు పరుగెత్తారు. సముద్రపు నీటి మట్టం అకస్మాత్తుగా తగ్గిపోవడంతో సునామీ వస్తుందేమోనని అందరూ భయపడి పరుగులు తీశారని వారు తెలిపారు. ప్రజలు అక్కడి నుంచి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లకు చేరుకున్నారు. అధికారులు ఇప్పటికే చాలామందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు, అయినప్పటికీ ఉదయం నుంచి ప్రజలు ప్రాణభయంతో బయటే గడుపుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.