
వరుసగా మూడు భారీ విజయాలు సాధించడంతో ఇప్పుడు వెంకీ అట్లూరితో సినిమాలు చేసేందుకు టాలీవుడ్ స్టార్ హీరోలు క్యూ కడుతున్నారు. సినిమా ఇండస్ట్రీలో ఒక్క విజయం మనిషి జాతకాన్ని మార్చేస్తుంది. ఇక్కడ సక్సెస్ మాత్రమే మాట్లాడుతుంది. విజయం మీ వైపు ఉంటే ఆటోమేటిక్గా డిమాండ్ మీ తలుపు తడుతుంది. సరిగ్గా ఇప్పుడు ఇదే ఫార్ములా యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి విషయంలో నిజమవుతోంది.ధనుష్తో చేసిన 'సార్', దుల్కర్ సల్మాన్తో తీసిన 'లక్కీ భాస్కర్' చిత్రాలతో వరుసగా బ్లాక్బస్టర్ హిట్లు కొట్టిన వెంకీ(Venky atluri), తాజాగా బాక్సాఫీస్ వద్ద మరో సంచలనం సృష్టించారు. కోలీవుడ్ వర్సటైల్ యాక్టర్ సూర్య, మమితా బైజు ప్రధాన పాత్రల్లో నటించిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' చిత్రంతో హ్యాట్రిక్ సక్సెస్ సాధించారు. ఆగస్టు 14న విడుదలైన ఈ సినిమా, కేవలం మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టి బాక్సాఫీస్ దగ్గర దండయాత్ర చేస్తోంది. వరుసగా మూడు భారీ విజయాలు సాధించడంతో ఇప్పుడు వెంకీ అట్లూరితో సినిమాలు చేసేందుకు టాలీవుడ్ స్టార్ హీరోలు క్యూ కడుతున్నారు. అయితే వెంకీ మాత్రం తన తరువాతి చిత్రాన్ని ఒక ప్రత్యేకమైన అక్కినేని హీరోతో చేసే ప్లానింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ హీరో ఎవరో కాదు... అక్కినేని నాగ చైతన్య. ఫిల్మ్ నగర్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, నాగ చైతన్య కెరీర్లో ఎంతో ప్రతిష్టాత్మకమైన 25వ మైల్స్టోన్ మూవీకి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించబోతున్నారట. వరుస విజయాలతో ఫుల్ ఫామ్లో ఉన్న వెంకీతో తన 25వ సినిమాను పట్టాలెక్కించేందుకు నాగ చైతన్య కూడా చాలా ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. అసలు వీరిద్దరి కాంబినేషన్ వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. నాగ చైతన్య, వెంకీ అట్లూరి మధ్య కేవలం ప్రొఫెషనల్ సంబంధమే కాకుండా మంచి స్నేహం, అనుబంధం ఉన్నాయి. వెంకీ అట్లూరి దర్శకుడిగా మారినప్పటి నుంచి తాను