శ్రీ పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ద్వారా నల్లమల సాగర్కు ఆగస్టు 31వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నీటిని విడుదల చేసి జాతికి అంకితం చేశారు. నాలుగు జిల్లాల ప్రజల సాగు, తాగునీటి కష్టాలు తీర్చనున్న ఈ ప్రాజెక్టుకు భూములిచ్చిన గ్రామస్తులు మాత్రం కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ప్రభుత్వం ముందు నుంచే ఆగస్టు నెలాఖరుకు నీళ్లు విడుదల చేస్తామని, గ్రామాలు ఖాళీ చేయాలంటూ ముంపు గ్రామాల ప్రజలకు చెబుతూ వచ్చింది. కానీ, కొందరు ఇంకా ఆ గ్రామాలను పూర్తిగా ఖాళీ చేయలేదు. అయితే, ఇప్పుడు నీటిని విడుదల చేయడంతో ముంపు గ్రామాలకు ప్రభుత్వం రాకపోకలను నిలిపివేసింది.READ ALSO 'వెలిగొండ'లో కొట్టుకుపోయిన నలుగురు.. చెట్లెక్కి ఆర్తనాదాలు పెట్టిన ముగ్గురు, ఒకరు గల్లంతు! వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాలైన సుంకేసుల , కలనూతల, గుండంచర్లకు వెళ్లే మార్గాన్ని అధికారులు నిలిపివేశారు. అయితే, గ్రామాల్లోని తమ ఇళ్లల్లో కొన్ని లక్షల రూపాయల సామాన్లు ఉన్నాయని.. బర్రెలు, గొర్రెలు కూడా అక్కడే వదిలేశామని.. వాటిని తీసుకొచ్చుకోవడానికి చివరి అవకాశం ఇవ్వాలంటూ ముంపు ప్రాంత ప్రజలు వేడుకుంటున్నారు. కానీ, అక్కడి సెక్యూరిటీ సిబ్బంది మాత్రం లోపలికి అనుమతించకపోవడంతో పుచ్చకాయలపల్లి- సుంకేసుల మధ్యలోని కొండవద్దే పడిగాపులు కాస్తూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.నల్లమల సాగర్కు వెలిగొండ ప్రాజెక్టు నుంచి ఆగస్టు 31వ తేదీన రెండు టీఎంసీల నీటిని విడుదల చేశారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆగస్టు 31వ తేదీ రాత్రి సమయంలో ఒక బొలెరో వాహనం సుంకేసుల - కలనూతల రోడ్డు మార్గం నుంచి వస్తూ నీటి ప్రవాహాన్ని తట్టుకోలేక బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో మొత్తం నలుగురు గల్లంతవగా.. అందులోని ముగ్గురు దగ్గరలోని చెట్టు పైకెక్కి ప్రాణాలు కాపాడుకున్నారు, మరో వ్యక్తి ఆచూకీ మాత్రం తెలియలేదు.నీటి ప్రవాహానికి బొలెరో కొట్టుకుపోయిందని, నలుగురు వ్యక్తులు గల్లంతయ్యారన్న వార్తలు రావడంతో అప్పటికప్పుడు జిల్లా కలెక్టర్, మార్కాపురం డీఎస్పీతో పాటు స్థానిక