© 2026 nimisham.in

భారత క్రికెట్లో సంచలనంగా ఎదుగుతున్న 15 ఏళ్ల యువ కెరటం వైభవ్ సూర్యవంశీ, లండన్లోని ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ వేదికపై అరుదైన అనుభూతిని సొంతం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన వింబుల్డన్ పురుషుల సింగిల్స్ ఫైనల్ మ్యాచ్ను భారత మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్, టీ20 స్టార్లు సంజూ శాంసన్, అభిషేక్ శర్మలతో కలిసి ఐకానిక్ సెంటర్ కోర్ట్ నుంచి వైభవ్ ప్రత్యక్షంగా వీక్షించాడు. ఇటీవల ఇంగ్లాండ్తో టీ20 సిరీస్ ముగిసిన అనంతరం భారత క్రికెటర్లు ఈ గ్రాండ్ స్లామ్ ఈవెంట్లో సందడి చేశారు.ఈ సందర్భంగా జియోస్టార్తో మాట్లాడిన వైభవ్.. ప్రపంచంలోనే అత్యుత్తమ క్రీడా వేదికలలో ఒకటైన ఆల్ ఇంగ్లాండ్ క్లబ్కు రావడం ఇదే మొదటిసారని, ఇదొక గొప్ప అనుభవమని ఆనందం వ్యక్తం చేశాడు. "ఫైనల్స్ వంటి ఒత్తిడితో కూడిన మ్యాచ్లలో ప్రపంచ స్థాయి ఆటగాళ్లు ఎలా రాణిస్తారో ప్రత్యక్షంగా చూసి నేర్చుకోవాలనే లక్ష్యంతోనే ఇక్కడికి వచ్చాను" అని ఈ యువ క్రికెటర్ తన పర్యటన ఉద్దేశాన్ని వివరించాడు.గత నాలుగైదేళ్లుగా తాను టెన్నిస్ను క్రమం తప్పకుండా ఫాలో అవుతున్నానని వైభవ్ తెలిపాడు. చిన్నప్పటి నుంచి రాఫెల్ నాదల్, నొవాక్ జొకోవిచ్ల ఆటను చూసేవాడినని, ముఖ్యంగా జొకోవిచ్ అంటే తనకు అమితమైన ఇష్టమని (ఐడల్) వెల్లడించాడు. అయితే ఈ టోర్నీలో మాత్రం కొత్త తరం ఆటగాడు, ప్రపంచ నంబర్ 1 జాన్నిక్ సినర్కు మద్దతిచ్చానని, అతడి ఆటతీరు అద్భుతమని కొనియాడాడు.ఈ ప్రత్యేకమైన మ్యాచ్ కోసం కోట్, సూట్ ధరించి క్లాసిక్ లుక్లో కనిపించడంపై స్పందిస్తూ.. తన సీనియర్ అభిషేక్ శర్మ ఈ