© 2026 nimisham.in

ఇరాన్తో యుద్ధం కొనసాగుతున్న వేళ హర్మూజ్ జలసంధిలో అమెరికా సైన్యం కీలక చర్యలు చేపడుతోంది. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన ఈ మార్గంలో వాణిజ్య నౌకల రాకపోకలను అమెరికా సైన్యం పర్యవేక్షిస్తోంది. ట్యాంకర్ల ప్రయాణానికి భద్రత కల్పిస్తూ గల్ఫ్ నుంచి అంతర్జాతీయ మార్కెట్లకు చమురు సరఫరాను పునరుద్ధరించే ప్రయత్నం చేస్తోంది. అమెరికా సైనిక వర్గాలను ఉటంకిస్తూ ‘ఆక్సియోస్’ ఈ వివరాలను వెల్లడించింది.రోజుకు కోటి బ్యారెళ్ల చమురుయుద్ధానికి ముందు హర్మూజ్ జలసంధి నుంచి వెళ్లే చమురు పరిమాణంలో సగం మేర ప్రస్తుతం రవాణా జరుగుతోంది. రోజుకు సుమారు కోటి బ్యారెళ్ల చమురు ఈ మార్గం మీదుగా వెళ్తున్నట్లు అమెరికా అధికారులు తెలిపారు. కొన్ని రోజుల్లో ఇది రెండు కోట్ల బ్యారెళ్లకు కూడా చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం.గల్ఫ్ దేశాల నుంచి చమురు తీసుకెళ్లే ట్యాంకర్లకే కాకుండా ఖాళీగా ఉన్న ట్యాంకర్లు తిరిగి గల్ఫ్లోకి ప్రవేశించేందుకు కూడా అమెరికా భద్రత కల్పిస్తోంది. చమురు నింపుకున్న తర్వాత అవే నౌకలు మళ్లీ హర్మూజ్ మీదుగా బయటకు వెళ్లేలా రాకపోకలను సమన్వయం చేస్తోంది.దక్షిణ మార్గంలో ప్రత్యేక కారిడార్హర్మూజ్లోని దక్షిణ మార్గంలో అమెరికా నియంత్రిత షిప్పింగ్ కారిడార్ను ఏర్పాటు చేసినట్లు ‘ఆక్సియోస్’ తెలిపింది. ఒమన్ తీరానికి సమీపంలోని ఈ మార్గంలో ట్యాంకర్ల కదలికలను ముందుగానే సమన్వయం చేస్తున్నారు.గత రెండు వారాలుగా ప్రతి రాత్రి సుమారు 15 నుంచి 20 ట్యాంకర్లు ఈ మార్గంలో ప్రయాణిస్తున్నట్లు అమెరికా అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యకలాపాలను నార్త్ కరోలినాలోని ఫోర్ట్ బ్రాగ్ నుంచి పనిచేస్తున్న ప్రత్యేక టాస్క్ఫోర్స్