
అమెరికాతో శాంతి చర్చల విషయంలో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఇరు దేశాల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం ప్రకారం తాము శాంతి మార్గంలోనే పయనిస్తామని, అయితే అందుకు అమెరికా ముందుగా తమపై నమ్మకాన్ని పెంచే వాతావరణాన్ని కల్పించాలని స్పష్టం చేశారు.శనివారం టెహ్రాన్లో జరిగిన మీడియా సమావేశంలో పెజెష్కియాన్ మాట్లాడారు. "అవగాహన ఒప్పందంలోని అంశాల ఆధారంగా మేం శాంతి మార్గంలో ముందుకు సాగడానికి ప్రయత్నిస్తున్నాం. దేశంలో ప్రస్తుతం ఐక్యత, శక్తి, సంఘీభావం ఉన్నాయి. కాబట్టి ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి ఇదే సరైన సమయం. అమెరికా సృష్టించిన అపనమ్మక వాతావరణాన్ని వీడి, విశ్వాసాన్ని కల్పిస్తే ఈ ఎంవోయూను ప్రాతిపదికగా చేసుకుని ముందుకు వెళ్లాలనే దృఢ సంకల్పంతో ఉన్నాం" అని వివరించారు.అమెరికాతో చర్చల విషయంలో తాము ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ఉంటామని పెజెష్కియాన్ స్పష్టం చేశారు. అమెరికా ఒప్పందానికి ఎంతమేర కట్టుబడి ఉంటుందో, ఇరాన్ కూడా అదే స్థాయిలో తన నిబద్ధతను ప్రదర్శిస్తుందని తెలిపారు. ఒకవేళ అవతలి పక్షం బలప్రయోగానికి దిగితే తాము లొంగిపోయే ప్రసక్తే లేదని హెచ్చరించారు. అంతిమంగా ఇరాన్ చర్యలు సర్వోన్నత నాయకుడు మొజ్తబా ఖమేనీ నిర్ణయాల మేరకే ఉంటాయని ఆయన పేర్కొన్నట్లు జిన్హువా వార్తా సంస్థ తెలిపింది.అంతకుముందు, శుక్రవారం తన కార్యాలయ వెబ్సైట్లో ప్రచురితమైన ఒక ఇంటర్వ్యూలో కూడా పెజెష్కియాన్ ఇదే విషయాన్ని పునరుద్ఘాటించారు. దేశ హక్కుల పరిరక్షణ కోసం చర్చలకే కట్టుబడి ఉంటామని, అయితే ఎవరి ఒత్తిళ్లకు లొంగబోమని స్పష్టం చేశారు. అమెరికా తన హామీలను నెరవేర్చినంత కాలమే ఇరాన్ కూడా