Upcoming IPOs: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు పండగే. భారతీయ ప్రాథమిక మార్కెట్ ఈవారం పబ్లిక్ ఇష్యూలతో కళకళలాడనుంది. ప్రముఖ ఇ-కామర్స్ ఎనేబుల్మెంట్ ప్లాట్ ఫామ్ షిప్రాకెట్, ప్రముఖ డెయిరీ బ్రాండ్ మిల్కీ మిస్ట్ వంటి దిగ్గ కంపెనీలతో సహా మొత్తం 9 కంపెనీలు ఐపీఓకు వస్తున్నాయి. ఈ కంపనీలు అన్నీ కలిసి రూ.7,681 కోట్లు సమీకరించేందుకు మార్కెట్లోకి అడుగుపెడుతున్నాయి. లిస్టింగ్ గెయిన్స్ కోసం పెట్టుబడి పెట్టాలనుకునే వారికిఇది మంచి అవకాశంగా చెప్పవచ్చు. మరి ఏ కంపెనీ ఎప్పుడు వస్తుంది? అనే వివరాలు తెలుసుకుందాం.ఈ జాబితాలో మోల్బియో డయోగ్నిస్టిక్స్ (Molbio Diagnostics), ధూత్ ట్రాన్స్మిషన్, మిల్కీ మిస్ట్ డైరీ ఫుడ్, ఫాస్కినేట్ టెక్స్టైల్స్, షిప్రాకెట్, బెహారీ లాల్ ఇంజినీరింగ్, ప్రమోదిని మెడికేర్, క్యూ అండ్ టీ ఫుడ్స్, షామ్ ఫామ్ వంటివి ఉన్నాయి. ఈ కంపెనీల పబ్లిక్ ఇష్యూలు ఆగస్టు 10 నుంచి 12వ తేదీల మధ్య సబ్స్క్రిప్షన్ ప్రారంభిస్తున్నాయి. ఆగస్టు 14 వరకు సబ్స్క్రిప్షన్ కొనసాగనుంది. అలాగే వీటితో పాటు ఈ వారం ఏకంగా 8 కంపెనీలు మార్కెట్ల లిస్టింగ్ కానున్నాయి.అతిపెద్ద ఐపీఓ ఇదేఈ వారం వస్తున్న పబ్లిక్ ఇష్యూల్లో ధూత్ ట్రాన్స్మిషన్ అతిపెద్ద ఐపీఓగా నిలిచింది. ఈ పబ్లిక్ ఇష్యూ ఆగస్టు 10వ తేదీన మొదలై 12వ తేదీతో ముగుస్తుంది. ఈ మెయిన్బోర్డ్ ఐపీఓ షేరు ధరలు రూ.829- 871గా నిర్ణయించారు. గరిష్ఠ ధర వద్ద రూ.3066.89 కోట్లు సమీకరించనుంది. ఇందులో తాజా షేర్ల జారీ ద్వారా రూ.1400 కోట్లు, ఆఫర్ ఫర్ సేల్ ద్వారా రూ.1,666.89 కోట్లు సమీకరించనుంది. ప్రస్తుతం ఈ ఐపీఓ గ్రే మార్కెట్ ప్రీమియం 29 శాతంగా ఉంది.Read Also: Zepto IPO: ఇన్వెస్టర్లకు గుడ్న్యూస్.. రూ.11000 కోట్ల జెప్టో ఐపీఓ.. మరో 5 కంపెనీలకూ సెబీ ఆమోదంమిల్కి మిస్ట్ డైరీ ఫుడ్ ఐపీఓమిల్కి మిస్ట్ డైరీ ఫుడ్ లిమిటెడ్ (Milky Mist Dairy Food IPO) పబ్లిక్