
కర్నూలు జిల్లాలో ఈసారి సరికొత్త ఆలోచనలు, వినూత్న అలంకరణలతో వినాయక మండపాలు దర్శనమిస్తున్నాయి. ఈ సారి కొత్తగా నగరంలో తమిళనాడు రాష్ట్రం నుంచి ప్రత్యేకంగా తెప్పించిన గురివింద గింజలతో స్థానిక యువకులు గణనాథుడిని ఏర్పాటు చేశారు. సుమారు ఇరవై రోజుల పాటు శ్రమించి ఈ వినూత్న గణపతిని రూపొందించినట్టు నిర్వాహకులు తెలిపారు. అలాగే సినీ నటుడు రవితేజ నటించిన ‘ఇరుముడి’ చిత్రంలోని అయ్యప్ప స్వామి ఆలయాన్ని తలపించేలా శ్రీ లక్ష్మి జమ్ములమ్మ వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో భారీ సెట్టింగ్ వేశారు. శబరిమలలో మహిళల ప్రవేశానికి ఉన్న పరిమితుల దృష్ట్యా, ఇక్కడే భక్తులు అయ్యప్ప సన్నిధానాన్ని దర్శించుకునేలా ఈ ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.