
నిబంధనల అమలులో కఠినంగా వ్యవహరిస్తారని పేరున్న ఓ ఐఏఎస్ అధికారికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఆయన వేదికపైకి వస్తుండగా అంతా లేచి నిలబడి కరతాళధ్వనులతో అపూర్వ స్వాగతం పలికారు. మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్డీఏ) కమిషనర్ తుకారాం హరిభావు ముంధేకు పూణెలో ఈ అరుదైన గౌరవం లభించింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.అసలేం జరిగింది? మహారాష్ట్రలో ఆహార భద్రతా నిబంధనలను ఉల్లంఘిస్తున్న సంస్థలపై ఎఫ్డీఏ కమిషనర్గా తుకారాం ముంధే కొరడా ఝుళిపిస్తున్నారు. ఆయన నేతృత్వంలో ముంబైతో సహా రాష్ట్రవ్యాప్తంగా హోటళ్లు, రెస్టారెంట్లపై అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. పరిశుభ్రత, ఆహార నాణ్యతా ప్రమాణాలు పాటించని సుమారు 100 సంస్థల లైసెన్సులను సస్పెండ్ చేశారు. ఈ కఠిన చర్యలు దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచాయి. ఈ నేపథ్యంలోనే పూణెలోని బాల్ గంధర్వ రంగ మందిర్లో జరిగిన ఓ కార్యక్రమానికి ముంధే హాజరయ్యారు. ఆయన వేదిక వైపు నడుస్తుండగా, సభలోని ప్రేక్షకులంతా ఒక్కసారిగా లేచి నిలబడి పెద్ద పెట్టున చప్పట్లు కొడుతూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. చాలా మంది తమ ఫోన్లలో ఈ దృశ్యాలను బంధించారు. ఆయన తీసుకుంటున్న చర్యలకు ప్రజల నుంచి లభిస్తున్న మద్దతుకు ఈ సంఘటనే నిదర్శనం.ఎవరీ తుకారాం ముంధే? మహారాష్ట్రలో అత్యంత సుపరిచితులైన ఐఏఎస్ అధికారుల్లో తుకారాం ముంధే ఒకరు. ఆయన తన నిక్కచ్చి వైఖరి, నిబంధనల కఠిన అమలుకు ప్రసిద్ధి. బీడ్ జిల్లాలోని ఓ సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన ఆయన, చిన్నతనంలో ఆర్థిక ఇబ్బందుల మధ్య పెరిగారు. జిల్లా పరిషత్