
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల గడువు దగ్గరపడుతోంది. సెప్టెంబర్ 15 నుండి 23వ తేదీ వరకు తిరుమలలో అత్యంత వైభవంగా, కన్నుల పండువగా ఈ ఉత్సవాలు జరుగనున్నాయి. లక్షలాదిమంది భక్తులు స్వామివారిని దర్శించుకోనున్నారు. వీటిని విజయవంతం చేయడంపై తిరుమల తిరుపతి దేవస్థానం దృష్టి సారించింది. వరుస సమీక్షలను నిర్వహిస్తోంది. విభాగాధిపతులకు అవసరమైన ఆదేశాలను ఇస్తూ వస్తోంది.ఈ క్రమంలో టీటీడీ అదనపు కార్యనిర్వహణాధికారి సీహెచ్ వెంకయ్య చౌదరి.. అన్న ప్రసాదాల తయారీకి కూరగాయలను విరాళంగా అందిస్తున్నదాతలతో సమావేశం అయ్యారు. బ్రహ్మోత్సవాల సమయంలో కూరగాయల సరఫరా, రవాణా, నిల్వ, వినియోగం, నాణ్యత, భవిష్యత్ అవసరాలు తదితర అంశాలపై దాతలతో చర్చించారు. లక్షలాదిమంది భక్తులు తిరుమలకు రాబోతోన్నందున కూరగాయల సరఫరా విషయంలో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు.శ్రీవారి అన్న ప్రసాద వితరణలో కూరగాయల దాతల సేవలు అత్యంత కీలకమైనవని సీహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు. గత నాలుగైదు నెలలుగా తిరుమలలో రోజుకు సుమారు నాలుగు లక్షల మందికి అన్నప్రసాదం అందిస్తున్నామని, ఇందుకోసం సగటున 13 నుంచి 14 టన్నుల బియ్యం, ఎనిమిది టన్నులకు పైగా కూరగాయలు వినియోగిస్తున్నామని చెప్పారు. ఇంత భారీ స్థాయిలో కూరగాయలను నిరంతరం దాతల ద్వారా సమకూరడం గొప్ప విషయమని అన్నారు.Tirumala: తిరుమలలో శరవేగంగా.. : టీటీడీ తక్షణ ఆదేశాలు జారీగత 25 నుంచి 30 సంవత్సరాలుగా ఏపీ, తమిళనాడు, కర్ణాటకల్లోని పలు ప్రాంతాల నుంచి 30 మంది దాతలు 33 రకాల కూరగాయలను సమకూరుస్తున్నారని వివరించారు. అన్నప్రసాదం అవసరాలకు అనుగుణంగా ఏ సమయంలో ఏ కూరగాయ ఎంత అవసరమో ముందుగానే ప్రణాళిక రూపొందించి, దాతలతో సమన్వయం చేసుకుని కూరగాయలను స్వీకరిస్తున్నామని, నాణ్యత, ప్యాకింగ్, రవాణా తదితర అంశాల్లో దాతలు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని అభినందించారు.తిరుమలలో ముమ్మరంగా ట్రైన్ ది ట్రైనర్స్కూరగాయలు త్వరగా పాడయ్యే స్వభావం కలిగినవి కావడం వల్ల వాటిని నిల్వ ఉంచడంలో కోల్డ్ స్టోరేజీ సౌకర్యాన్ని వినియోగించుకుంటోన్నట్లు వెంకయ్య చౌదరి వివరించారు. మూడేళ్ల కిందటి