
వాషింగ్టన్: అమెరికా ఎన్నికల్లో ఓటరు గుర్తింపు, పౌరసత్వ నిబంధనలను కఠినతరం చేసేందుకు ప్రయత్నిస్తున్న డొనాల్డ్ ట్రంప్ (Donald Trump).. తక్షణమే ‘సేవ్ అమెరికా యాక్ట్’ (Save America Act)ను ఆమోదించాల్సిన అవసరముందని పునరుద్ఘాటించారు. ఈ సందర్భంగా భారత్, అమెరికా ఎన్నికల వ్యవస్థలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇటీవల భారత్ సీఈసీ జ్ఞానేశ్కుమార్ ఎన్నికల నిర్వహణపై మా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గుర్తింపు కార్డు లేకుండా అమెరికాలో ఎన్నికలు ఎలా నిర్వహిస్తారన్నారు. భారత్లో 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 64.6 కోట్ల మంది ఓటర్లు పాల్గొన్నారు. కేవలం ఒకటి శాతం కంటే తక్కువ మంది మాత్రమే మెయిల్ ద్వారా ఓటు వేశారు. భారత్లో ప్రతి ఓటరు దగ్గర తప్పనిసరిగా చెల్లుబాటయ్యే ఫొటో గుర్తింపు కార్డు ఉంటుంది. ఎన్నికల నిర్వహణపై భారత్ను ఓ ఉదాహరణగా తీసుకోవాలి. వెంటనే ‘సేవ్ అమెరికా యాక్ట్’ను ఆమోదించుకోవాలి’’ అని సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్లో డొనాల్డ్ ట్రంప్ పోస్టు చేశారు. అమెరికా ఎన్నికల్లో కఠిన నిబంధనలు అమలు చేయాలని గత కొన్నాళ్లుగా ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో భారత్, అమెరికా ఎన్నికల విధానాలను సరిపోలుస్తూ.. తన వాదనలకు బలం చేకూర్చుకునేందుకు యత్నిస్తున్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు