
మహారాష్ట్రలోని పుణే జిల్లా బారామతి ఎయిర్పోర్టులో ఆదివారం మధ్యాహ్నం 12,35 గంటల ప్రాంతంలో కార్వార్ ఏవియేషన్కు చెందిన శిక్షణా విమానం ప్రమాదానికి గురైంది. విమానం రన్వేపై కదులుతున్న(టాక్సీయింగ్) సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, సంబంధిత అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ప్రమాదానికి గల కచ్చితమై కారణం ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.భయంకపితులను చేసిన ఆ ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఘటనలో అసలు విషయాలు వెలుగులోకి ఈ ప్రమాద వివరాలను పుణే ఎస్పీ వెల్లడించారు. బారామతి ఎయిర్ఫీల్డ్లో శిక్షణలో భాగంగా సర్క్యూట్, అత్యవసర ల్యాండింగ్ విన్యాసాలను సాధన చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ విమానంలో కెప్టెన్ చిరాగ్ శశికాంత్ దోయిఫోడే , క్యాడెట్ పైలట్ అభిజీత్ జుండ్రే ఉన్నారు. ఈ ఘటనపై విమానయాన అధికారులు, స్థానిక పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విమానానికి సంబంధించిన సాంకేతిక లోపమా లేక ల్యాండింగ్ సమయంలో తలెత్తిన ఇతర కారణాల వల్ల ఈ ప్రమాదం జరిగిందా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. రన్వేపై విమానం నియంత్రణ కోల్పోవడానికి గల కారణాలను విశ్లేషిస్తున్ారు. మరిన్ని వివరాలు దర్యాప్తు పూర్తయిన తర్వాత వెలువడే అవకాశం ఉంది. పసిడి ధరలను పరుగులు పెట్టిస్తోన్నాయ్: న్యూ ట్రెండ్- ఇకపై !!గతంలోనూ వరుస ప్రమాదాలు బారామతి ప్రాంతంలో గత కొన్ని నెలలుగా వరుసగా విమాన ప్రమాదాలు చోటుచేసుకోవడం కలకలం రేపుతోంది. దాదాపు 7 నెలల క్రితం జనవరి 28న విమానం ల్యాండింగ్ సమయంలో కూలిపోవడంతో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తో పాటు మరో నలుగురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మే 13న కూడా గోజుబావి గ్రామం వద్ద ఓ శిక్షణా విమానం విద్యుత్ స్తంభాన్ని ఢీకొని కూలిపోయింది. నేటి ప్రమాదంతో ఈ ప్రాంతంలో ఏవియేషన్ భద్రతపై మళ్లీ చర్చ మొదలైంది