
టాలీవుడ్ హీరోలు కొందరు నిర్మాతలుగానూ అలరించే ప్రయత్నంలో ఉన్నారు. తామే నటిస్తూ కొన్ని- ఇతర హీరోలతో మరికొన్ని సినిమాలు నిర్మిస్తూ సాగుతున్నారు. మరి వీరిలో సక్సెస్ రూటులో పయనిస్తున్నవారు ఎందరు!? ఇప్పటి హీరోల్లో కొందరు నటనలో కొనసాగుతూనే నిర్మాతలుగానూ అలరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఆ రూటులో సాగినవారెందరో ఉన్నారు. నవతరం కథానాయకుల్లో రామ్ పోతినేని, మంచు మనోజ్ వంటివారు చిత్ర నిర్మాణంలో అడుగుపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. 'రాపో సినిమాటిక్స్' పతాకంపై తన సోదరుడు పోతినేని కృష్ణ నిర్మాతగా రామ్ పోతినేని స్వీయ దర్శకత్వంలో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక మంచు మనోజ్ 'ఎమ్.ఎమ్.ఆర్ట్స్' పతాకంపై ప్రతిభను ప్రోత్సహిస్తూ ఇతరులకు అవకాశాలు కల్పించే పనిలో ఉన్నారు. వీరిద్దరూ ప్రొడ్యూసర్స్ గా 'ఆన్ ద వే'లోనే ఉన్నారు. వీరి సినిమాలు జనం ముందుకు వచ్చాకే వారి అభిరుచి ఏ పాటిదో తెలుస్తుంది. ఇంతకు ముందు నితిన్, విజయ్ దేవరకొండ, అల్లరి నరేశ్, సుధీర్ బాబు వంటివారు కూడా నిర్మాతలుగా మారారు. అఖిల్ హీరోగా నితిన్ 'అఖిల్' సినిమా నిర్మించారు. 'మీకు మాత్రమేచెబుతా' అనే చిత్రంతో విజయ్ దేవరకొండ నిర్మాతగా మారారు. ఈ ఇద్దరు హీరోలు ఇతరులతో చిత్రాలు నిర్మించేసి తరువాత నిర్మాణం వైపు చూడలేదు. అల్లరి నరేశ్ 'బందిపోటు', సుధీర్ బాబు 'నన్ను దోచుకుందువటే' సినిమాల్లో హీరోలుగా నటిస్తూనే నిర్మించారు. మళ్ళీ చిత్ర నిర్మాణంవైపు వీరు కూడా చూడకపోవడం గమనార్హం. కిరణ్ అబ్బవరం ఇతరులతో 'తిమ్మరాజు పల్లి టీవీ' నిర్మించారు. తాను హీరోగా నటిస్తూ- దర్శకత్వం వహిస్తూ కిరణ్ అబ్బవరం 'రియాలిటీ' అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాతో కిరణ్ అబ్బవరం బహుముఖ ప్రజ్ఞ బయల్పడనుంది. అసలు పేరున్న హీరోలు సినిమాలు నిర్మించడమన్నది ఇప్పట్లోనే ఏదో మొదలయిందని ఈ తరం ప్రేక్షకులు భావించవచ్చు. కానీ, తెలుగు సినిమాలో తొలి స్టార్ హీరోగా నిలచిన మహానటుడు చిత్తూరు వి.నాగయ్యనే నిర్మాత, దర్శకునిగా సినిమాలు నిర్మించి ఆకట్టుకున్నారు. ఆయన