
<figure><img src="https://static.10tv.in/wp-content/uploads/2026/09/Tirumala-Devotees-1024x576.jpg" class="attachment-large size-large wp-post-image" alt="Tirumala Devotees" decoding="async" loading="lazy" /></figure><ul> <li><strong>శ్రీవారి భక్తుల కోసం వీకెండ్స్లో ప్రత్యేక రైలు</strong></li> <li><strong>మచిలీపట్నం నుంచి తిరుచానూరుకు రైలు.. </strong></li> <li><strong>ఈ స్టేషన్ల మీదుగా తిరుచానూరుకు సర్వీస్</strong></li> </ul> <p><strong>Tirumala Devotees :</strong> తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. కొత్త రైలు సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. భక్తుల రద్దీని దృష్ట్యా మచిలీపట్నం–తిరుచానూరు మధ్య స్పెషల్ రైలు నడవనుంది. ప్రత్యేకించి వారాంతాల్లో ఈ రైలు సర్వీసులను అందించనుంది. ఈ మార్గంలో ప్రయాణించే భక్తులకు అదనపు రైలు సదుపాయం లభించనుంది.</p> <p>07440 నంబర్ మచిలీపట్నం–తిరుచానూరు ప్రత్యేక రైలు శుక్రవారం, శనివారాల్లో నడుస్తుంది. మచిలీపట్నంలో సాయంత్రం 4.55 గంటలకు బయల్దేరే రైలు గుడివాడకు 5.23 గంటలకు, విజయవాడకు 6.20 గంటలకు చేరుకుంటుంది.</p> <p>తెనాలికి రాత్రి 7 గంటలకు, చీరాలకు 7.48 గంటలకు, ఒంగోలుకు 8.48 గంటలకు చేరుతుంది. అనంతరం నెల్లూరుకు 10.28 గంటలకు, రేణిగుంటకు అర్ధరాత్రి 1 గంటలకు చేరుకుని తిరుచానూరుకు 2 గంటలకు చేరుకోనుంది.</p> <p><strong>Read Also : <a href="https://10tv.in/telugu-news/andhra-pradesh/andhra-pradesh-needs-a-third-political-party-says-vijay-sai-reddy-rules-out-family-cm-candidate-sh-1133643.html">Vijay Sai Reddy : ఏపీకి మూడో పార్టీ అవసరం.. సీఎం అభ్యర్థిని నేను కాదు, నా కుటుంబంలోనూ ఎవరూ ఉండరు : విజయసాయిరెడ్డి</a></strong></p> <p>రైలు తిరుగు ప్రయాణంలో 07439 నంబర్ తిరుచానూరు–మచిలీపట్నం స్పెషల్ రైలు శనివారం, ఆదివారం నడుస్తుంది. తిరుచానూరులో తెల్లవారుజామున 3.30 గంటలకు బయల్దేరి విజయవాడకు ఉదయం 11 గంటలకు, మచిలీపట్నానికి మధ్యాహ్నం 1.30 గంటలకు చేరుకోనుంది.</p> <p><strong>గుంటూరు–చర్లపల్లి మధ్య మరో స్పెషల్ ట్రైన్ :</strong><br /> మరోవైపు గుంటూరు–చర్లపల్లి మధ్య కూడా 07227/07228 నంబర్లతో ప్రత్యేక రైలు నడవనుంది. గుంటూరు–చర్లపల్లి రైలు ప్రతి ఆదివారం రాత్రి 9.45 గంటలకు బయల్దేరి ఉదయం 4 గంటలకు చర్లపల్లికి చేరుతుంది.</p> <p>తిరుగు ప్రయాణంలో సోమవారం రాత్రి 11.50 గంటలకు చర్లపల్లిలో బయల్దేరి ఉదయం 6.10 గంటలకు గుంటూరుకు చేరుకుంటుంది. ఈ రైలు సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నల్లగొండ, నడికుడి, మిర్యాలగూడ స్టేషన్లలో ఆగుతుంది. తిరుమల భక్తులతో పాటు తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు కూడా అదనపు రైలు సౌకర్యం అందుబాటులో ఉంటుంది.</p> Tirumala Devotees : తిరుమల శ్రీవారి భక్తుల కోసం మచిలీపట్నం–తిరుచానూరు మధ్య ప్రత్యేక రైలు అందుబాటులోకి వచ్చింది. రైలు నంబర్లు, వారంలో ఏయే రోజుల్లో నడుస్తుంది, స్టేషన్లు, పూర్తి టైమింగ్స్ వివరాలివే..