ఆంధ్రప్రదేశ్లో ముగ్గురు ప్రభుత్వ ఉపాధ్యాయులు సస్పెండ్ అయ్యారు. కడప జిల్లా వేంపల్లి మండలానికి చెందిన ముగ్గురు టీచర్లపై వేటు పడింది. ఏపీలో నిర్వహించిన మెగా డీఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ ఓ ప్రతినిధి బృందం కేంద్ర మంత్రి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి ఫిర్యాదు చేసింది. ఆ బృందంతో పాటుగా ముగ్గురు ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా ఉన్నారు.. ఆ ఫోటో కూడా వైరల్ అయ్యింది. దీంతో కడప జిల్లాకు చెందిన ఎస్జీటీలు అమర్నాథ్రెడ్డి, సంగమేశ్వరరెడ్డి, వెంకటనాథరెడ్డిపై చర్యలు తీసుకున్నారు. సర్వీసు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు ముగ్గురిని సస్పెండ్ చేసినట్లు డీఈవో షంషుద్దీన్ ఉత్తర్వులు జారీ చేశారు. ముగ్గురు ప్రభుత్వ టీచర్ల సస్పెన్షన్ వ్యహారం చర్చనీయాంశంగా మారింది.మెగా డీఎస్సీ ప్రక్రియలో అక్రమాలు జరిగాయంటూ ఇటీవల ఓ ప్రతినిధుల బృందం ఢిల్లీకి వెళ్లి కేంద్ర విద్యాశాఖ మంత్రిని కలిసి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. కేంద్రమంత్రిని కలిసిన బృందం వెంట కడప జిల్లాకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులు అమర్నాథ్రెడ్డి, సంగమేశ్వర్రెడ్డి, వెంకటనాథ్రెడ్డి ఉన్నారు. ఈ ముగ్గురు ప్రభుత్వ సర్వీస్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని.. ముందుగా ఎలాంటి అనుమతి తీసుకోకుండానే కేంద్ర మంత్రిని కలిసి ఫిర్యాదు చేయడంపై విద్యాశాఖ తీవ్రంగా పరిగణించినట్లు తెలుస్తోంది. అందుకే ఈ ముగ్గురు ప్రభుత్వ ఉపాధ్యాయుల్ని సస్పెండ్ చేశారు.ఇదిలా ఉంటే మరో వాదన కూడా వినిపిస్తోంది. ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ మినహాయింపు కోసం వీరు కేంద్రమంత్రిని కలిసినట్లు చెబుతున్నారు. ఈ ముగ్గురు టీచర్స్ అసోసియేషన్ ప్రతినిధులంటున్నారు. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ మినహాయింపు అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారని వైఎస్సార్సీపీ చెబుతోంది. ఉపాధ్యాయుల సమస్యలపై మాత్రమే కేంద్రమంత్రుల్ని కలవడానికి ప్రయత్నించారంటున్నారు. వారు డీఎస్సీ గురించి మాట్లాడలేదని.. డీఎస్సీకి సంబంధించిన ఎలాంటి వినతిపత్రం కూడా సమర్పించలేదన్నారు. ఉపాధ్యాయుల సమస్యల గురించి మాట్లాడారని.. ఇలా సస్పెండ్ చేయడం సరికాదన్నారు. ఈ సస్పెన్షన్లను ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.ఈ ముగ్గురిలో నర్రెడ్డి సంగమేశ్వరరెడ్డి ఎస్టీయూ