
అద్భుతమైన సాహిత్యాన్ని సంగీత ప్రపంచానికి అందించిన కవికులాలంకార వేటూరి సుందరరామమూర్తి సాహితీ మహోత్సవం అమెరికాలోని డాలస్లో అత్యంత వైభవంగా జరిగింది. ఆదివారం ‘వేటూరి సాహిత్యాభిమాన సమితి ఆఫ్ అమెరికా’, ‘శుభం ఫౌండేషన’ సంయుక్త ఆధ్వర్యంలో ప్రిస్కో మెమోరియల్ హైస్కూల్ ఆడిటోరియంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. వేటూరి విరచిత ఎనిమిది సినీ, సినీయేతర గీత సంపుటాల ఆవిష్కరణ, వేటూరి ప్రత్యేక పాటల నృత్య, సంగీత విభావరి నిర్వహించగా.. దాదాపు 500 మందికి పైగా సంగీత, సాహిత్యాభిమానులు విచ్చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ కవి, సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు ఈ సాహిత్య సంపుటాలను ఆవిష్కరించి.. తొలి ప్రతిని విశిష్ట అతిథి ‘ఈనాడు’ దినపత్రిక సంపాదకులు ఎం.నాగేశ్వరరావు, ప్రత్యేక అతిథులు వామరాజు సత్యమూర్తి, డా. కొమాండూరి రామాచారికి అందజేశారు. అమెరికాలోని వేటూరి సాహిత్యాభిమాన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు డా.ప్రసాద్ తోటకూర, శుభం ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు గోపాల్ పోణంగి ఆధ్వర్యంలో ఆసక్తికరంగా సాగిన ఈ కార్యక్రమంలో సాహిత్య సంపుటాల ప్రచురణకు సహాయ సహకారాలు అందించిన డా.బుచ్చిబాబు పైడిపాటి, చంద్రహాస్ మద్దుకూరి, చంద్రశేఖర్ రెంటచింతల, గోకుల్ కిలారు, ప్రొఫెసర్ జగదీశ్వరన్ పుడూర్, మురళి వెన్నం, డా.నరసింహా రెడ్డి ఊరిమిండి, రామకృష్ణ పొక్కునూరి, రావు కల్వల, డా.సుబ్రహ్మణ్యం బోయారెడ్డి, విజయసారథి జీడిగుంట, వినోద్ ఉప్పులను ఘనంగా సత్కరించారు. జొన్నవిత్తులతో ప్రసాద్ తోటకూర ముఖాముఖీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావుతో డా.ప్రసాద్ తోటకూర నిర్వహించిన ముఖాముఖి ఆకట్టుకుంది. పాత్రికేయుడిగా ఉన్న వేటూరి నందమూరి తారకరామారావు ఒత్తిడి మేరకు అయిష్టంగా రచయితగా సినీరంగ ప్రవేశం చేయడం, ఆ తర్వాత సినీ పరిశ్రమలో రాణించడం, కవి పండితులుగా వేటూరి కవితా వైభవం, ఆయన కలం నుంచి వెలువడిన గీతాల వెల్లువ, ఆయన వ్యక్తిత్వం, అందరినీ గౌరవించే తత్వం, ఆయన తెలుగు భాషాభిమానం, పాత్రికేయునిగా, సంపాదకుడిగా రచనా శైలి, కేవలం వేల కొద్దీ సినిమా గీతాలేగాక ఎన్నో విలువైన వ్యాసాలు, ‘జీవనరాగం’, ‘రాబిన్