కుకు విత్ జాతిరత్నాలు రెండో సీజన్ ముగిసింది. ఆదివారం గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ జరిగింది. ఈ ఎపిసోడ్ సాయంత్రం టీవీల్లో ప్రసారం అవుతుంది. అయితే జియో హాట్ స్టార్లో మాత్రం ఆల్రెడీ వచ్చేసింది. ఇక దీంతో విన్నర్ ఎవరు అన్నది ముందే తెలిసిపోయింది. ఈ రెండో సీజన్ విన్నర్గా తనూజ నిలిచింది. ఫస్ట్ సీజన్లోనూ తనూజ కుక్గా వచ్చింది. అయితే చివరిలో మిస్ అయింది. ఫస్ట్ సీజన్ విన్నర్గా వదినమ్మ ఫేమ్ సుజిత నిలిచింది. ఈ రెండో సీజన్ విన్నర్గా తనూజ నిలిచింది. ఇక బిగ్ బాస్ షోలో రన్నర్గా, కుకు షో విన్నర్గా తనూజ మరింత క్రేజ్ను దక్కించుకున్నట్టు అయింది.ఈ ఫినాలే ఎపిసోడ్లో రాకేష్ పాన్ ఇండియా డిష్ చేశాడు. ప్రతీ ఒక్క స్టేట్ నుంచి స్పెషల్ వంటకాన్ని తీసుకు వచ్చి థాలిని ప్రజెంట్ చేశాడు. సమన్వయ థాలీ అని ధమ్ ఆలు, దావత్ మటన్, సుల్తాన్ దాల్, పంత్ పరోరాట, మకాన కీర్, నైచూర్లను చేసి పెట్టాడు. తక్కువ టైంలో ఇన్ని వెరైటీలు చేయడం గ్రేట్ అని మెచ్చుకున్నారు. ఇక నిఖిల్ చేసిన నల్లి బొక్కల మటన్ ధమ్ పలావ్ విత్ మలబార్ చికెన్, కొకొనట్ పలావ్, చాక్లెట్ విత్ ఫ్రూట్ అండ్ నట్స్ని బాగుందని అన్నారు. ప్రజెంటేషన్ కూడా బాగుందని మెచ్చుకున్నారు
.