
బీసీలకు 34 శాతం రిజర్వేషన్ అమలుపై తెలుగుదేశం శ్రేణులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి, కృతజ్ఞత చాటుకున్నారు. చంద్రబాబు, దామచర్ల చిత్రపటాలకు పాలాభిషేకం బీసీలకు 34 శాతం రిజర్వేషన్ అమలుపై తెలుగుదేశం శ్రేణులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి, కృతజ్ఞత చాటుకున్నారు. గురువారం ఒంగోలులోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు బీసీ నాయకులు, పార్టీ నాయకులు మాట్లాడారు. బీసీల అభ్యున్నతికి, సామాజిక న్యాయానికి కట్టుబడి పనిచేస్తూ, స్థానిక సంస్థల్లో బీసీలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించే దిశగా కీలక నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ప్రజా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా థ్యాంక్యూ సీఎం సార్ అంటూ నినాదాలు చేశారు