తిరుమల కొండల్లో కుమారధార, పసుపుధార జలాశయాలు ఉన్నాయి.. ఎన్నో ఏళ్లుగా ఈ రెండు డ్యామ్ల కారణంగా ముంపు కష్టాలు ఎదురవుతున్నాయి. వర్షాలు పడే సమయంలో ఈ రెండు జలాశయాల్లో నీటిమట్టం పెరిగిన సమయంలో రాకపోలకు అంతరాయం ఎదురవుతోంది. ఈ ముంపు కష్టాలకు చెక్ పెడుతూ కుమారధార, పసుపుధార జలాశయాలను కలుపుతూ రూ.2.77 కోట్లతో డబుల్ లేన్ బ్రిడ్జిని నిర్మించనున్నారు. టీటీడీ పాలకమండలి నుంచి ఆమోదం రావడంతో డిపాజిట్ వర్క్ కింద రాష్ట్ర నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. ఈ బ్రిడ్జి ప్రస్తుతం టెండర్ల దశలో ఉంది.. త్వరలో డిజైన్లు ఖరారు చేస్తామని అధికారులు చెబుతున్నారుకుమారధార, పసుపుధార డ్యామ్లను కలుపుతూ ప్రస్తుతం ఒక కల్వర్టు ఉంది. భారీ వర్షాలు పడిన సమయంలో ఈ రెండు డ్యామ్లు నిండిపోయి పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుకున్న సమయంలో కల్వర్టు నీళ్లలో మునిగిపోయి.. దాదాపు పై నుంచి నీళ్లు ప్రవహిస్తున్నాయి. ఈ కారణంగా డ్యామ్లకు వెళ్లే అధికారులు, సిబ్బంది ఇబ్బందిపడుతున్నారు. రోజువారీ పనుల కోసం, అత్యవసర సమయాల్లో నిర్వహణ పనుల నిమిత్తం డ్యామ్లకు వెళ్లడం కష్టంగా మారింది. దీంతో కుమారధార, పసుపుధార డ్యామ్ల దగ్గర కొత్తగా బ్రిడ్జి నిర్మించాలని రిక్వెస్ట్లు వచ్చాయి.ఢిల్లీ నుంచి కేంద్ర జల సంఘం, సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ టీమ్లు ఇటీవల తిరుమలలోని ఈ డ్యామ్లను పరిశీలించాయి. ఆ సమయంలో ఈ రెండు డ్యామ్లను పరిశీలించి.. డ్యామ్ సేఫ్టీ యాక్ట్-2021లోని ఎమర్జెన్సీ యాక్షన్ ప్లాన్ అంశాన్ని ప్రస్తావించారు. కుమారధార, పసుపుధార డ్యామ్ల దగ్గరకు సులభంగా చేరుకునేలా, పాత కల్వర్టు స్థానంలో అప్రోచ్ రోడ్డుతో కూడిన డబుల్ లేన్ బ్రిడ్జి నిర్మించాలని ఆదేశించారు. అనంతరం ఈ బ్రిడ్జికి సంబంధించి రాష్ట్ర జలవనరుల శాఖ రూ.2.77 కోట్లతో అంచనా వ్యయంతో టీటీడీ వర్క్స్ కమిటీ సిఫార్సులతో పాలకమండలి ఆమోదం తెలిపింది. మొత్తం మీద కుమారధార, పసుపుధార జలాశయాల ముంపు సమస్యకు