
గత 23 సంవత్సరాలుగా అమెరికాలోని తెలుగువారికి మీడియాపరంగా సేవలందిస్తున్న తెలుగు టైమ్స్ ఇప్పుడు బే ఏరియా వాసులకోసం మరో సబ్ పోర్టల్ ను ప్రారంభించింది. బే ఏరియా తెలుగు టైమ్స్ వెబ్ సైట్ ను కొత్తగా ప్రారంభించింది. శుక్రవారం, 7 ఆగస్టు 2026న కాలిఫోర్నియాలో జరిగిన ఒక కార్యక్రమంలో ఫ్రీమాంట్ నగర మేయర్ శ్రీ రాజ్ సల్వాన్ మరియు మిల్పిటాస్ నగర మేయర్ శ్రీమతి కార్మెన్ మోంటానో కలిసి bayarea.telugutimes.net సబ్ పోర్టల్ను ఉమ్మడిగా ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలుగు టైమ్స్ ఎడిటర్ మరియు సీఈఓ శ్రీ వెంకట సుబ్బారావు చెన్నూరి మాట్లాడుతూ, 2003లో బే ఏరియా గుండెకాయలాంటి శాన్ హోసేలో ప్రారంభమైన తెలుగు టైమ్స్, ఈ 23 ఏళ్లలో ఒక ప్రధాన మీడియా హౌస్గా రూపాంతరం చెందిందని తెలిపారు. అమెరికాలో, ముఖ్యంగా కాలిఫోర్నియా బే ఏరియాలో తెలుగు సమూహం ఎదగడాన్ని ఇది దగ్గర నుండి చూసిందని పేర్కొన్నారు. తెలుగు టైమ్స్ 10వ వార్షికోత్సవం (2013) సందర్భంగా ‘పాఠశాల’ అనే తెలుగు బోధనా సదుపాయాన్ని ప్రారంభించిందని, నేడు అది ఎంతో విజయవంతంగా నడుస్తోందని చెప్పారు. అలాగే ఇ-పేపర్, ఆన్లైన్ సేవలను ప్రారంభించి, అగ్రెస్సివ్ కంటెంట్ మరియు డిజిటల్ మార్కెటింగ్ ద్వారా రోజుకు లక్ష మంది వీక్షకులతో గొప్ప వృద్ధిని సాధించిందన్నారు. 2023లో 20వ వార్షికోత్సవం సందర్భంగా పెరుగుతున్న తెలుగు వ్యాపారవేత్తల కోసం బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డులను ప్రారంభించామని, అది కూడా మంచి విజయం సాధించిందని గుర్తుచేశారు. ఇప్పుడు బే ఏరియాలోని ఫ్రీమాంట్, శాన్ హోసే, సన్నీవేల్, మిల్పిటాస్, డబ్లిన్, శాన్ రామోన్ వంటి 15 ప్రముఖ నగరాల అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక సబ్ పోర్టల్ను తీసుకొచ్చినట్లు వివరించారు. ఫ్రీమాంట్ నగరపు మొదటి ఇండో-అమెరికన్ మేయర్ శ్రీ రాజ్ సల్వాన్ తెలుగు టైమ్స్కు అభినందనలు తెలిపారు. నేటి కాలంలో ప్రజలు స్థానిక వార్తలను ఎక్కువగా చదువుతున్నారని, 23 ఏళ్ల అనుభవం ఉన్న తెలుగు టైమ్స్ బే