
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Telangana Teachers Strike: ఉపాధ్యాయులతో పెట్టుకుంటే పరిణామాలు ఎలా ఉంటాయో ప్రభుత్వం చూడాల్సి వస్తుందంటూ వార్నింగ్ ఇచ్చారు ఉపాధ్యాయ సంఘాలు. సీపీఎస్ విధానం రద్దు చేసి వెంటనే ఓపీఎస్ ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులతో పెట్టుకోవద్దంటూ హెచ్చరించారు. తమ డిమాండ్ల సాధన లక్ష్యం నేడు హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద ప్రొగ్రేసివ్ రికగ్నైజ్ టీచర్స్ యూనియన్ పీఆర్టీయూ మహాధర్నా కార్యక్రమం చేపట్టింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాలు నేతలు మాట్లాడారు. తమ డిమాండ్ల అమలుకు సర్కార్ తక్షణమే చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. ఈ మహాధర్నాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ.. మరో రెండు దఫాలు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుందని పదే పదే చెబుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. అదే నిజం కావాలంటే మేనిఫెస్టోలో నూటికి నూరు శాతం అమలు చేస్తేనే రెండు దఫాలు మీ ప్రభుత్వమే ఉంటుందన్నారు. గత ప్రభుత్వం ఐదు శాతం ఐఆర్ ఇచ్చి పీఆర్సీ కమిటీ వేయగానే.. కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో అనేక అంశాలను చేర్చింది. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి రాగానే పీఆర్సీ పాత కమిటీ రద్దు చేసి దాని స్థానంలో కొత్త కమిటీ వేసి 6 నెలల్లోపే నివేదిక తెప్పించుకుంటారని తాము భావించాము. కానీ పాత ప్రభుత్వం వేసిన పీఆర్సీ కమిటీనే పొడిగిస్తూ.. వెళ్తున్నారంటూ ఫైర్ అయ్యారు. మార్చి 31 తర్వాత రాష్ట్రంలో పీఆర్సీ కమిటీ మనుగడలో ఉందా లేదా అనేది ఉద్యోగ సంఘాలకు తెలియని పరిస్థితి ఏర్పడిందన్నారు. కమిటీ ఉంటే ఎందుకు రిపోర్టు ప్రభుత్వానికి చేరడం లేదని ప్రశ్నించారు. ఉద్యోగ సంఘాలు కార్యాచరణ తీసుకోగానే సీఎం పిలిచి