© 2026 nimisham.in

<figure><img src="https://static.10tv.in/wp-content/uploads/2026/09/Telangana-government-announces-Rs.-500-bonus-for-fine-variety-paddy-1024x576.jpg" class="attachment-large size-large wp-post-image" alt="Telangana government announces Rs. 500 bonus for fine-variety paddy." decoding="async" /></figure><p><b>అక్టోబర్ 15న ధాన్యం కొనుగోళ్లు</b></p> <p><b>8283 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు</b></p> <p><b>క్వింటాల్కు రూ.500 అదనపు బోనస్</b></p> <p>Telangana Government: తెలంగాణలోని రైతులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీపి కబురు అందించింది. రాబోయే వానాకాలం సీజన్కు సంబంధించి ధాన్యం కొనుగోళ్లను అక్టోబర్ 15 నుంచి ప్రారంభించేందుకు ముహూర్తం ఖరారు చేసింది. ఈ సీజన్లో దాదాపు రూ. 18,250 కోట్ల విలువైన 65 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్లోని ఎంసీఆర్హెచ్ఆర్డీలో అధికారులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన ఈ కీలక నిర్ణయాలను ప్రకటించారు.</p> <p><a href="https://10tv.in/telugu-news/andhra-pradesh/pollution-control-board-imposes-rs-21-crore-fine-on-andhra-paper-mill-sn-1133074.html" target="_blank" rel="noopener"><b>Andhra Paper Mill: ఆంధ్రా పేపర్ మిల్లుకు షాక్.. రూ.21 కోట్ల భారీ జరిమానా.. పవన్ కళ్యాణ్ మార్క్ యాక్షన్</b></a></p> <h2><span style="color: #ff0000;">రాష్ట్రవ్యాప్తంగా 8,283 కొనుగోలు కేంద్రాలు సిద్ధం:</span></h2> <p>రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రాష్ట్రవ్యాప్తంగా(Telangana Government) 8,283 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. వీటిలో 3,180 ఐకేపీ కేంద్రాలు, 4,372 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (PACS), 731 ఇతర కేంద్రాలు ఉన్నాయి. అక్టోబర్ 1 నాటికే ఈ కేంద్రాలన్నింటినీ పూర్తిస్థాయిలో సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. గన్నీ సంచులు, తూకం యంత్రాలు, రవాణా వాహనాలను అందుబాటులో ఉంచి కొనుగోలు చేసిన వెంటనే నిధులను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు.</p> <h3><span style="color: #ff0000;">మద్దతు ధరతో పాటు క్వింటాల్కు రూ.500 అదనపు బోనస్:</span></h3> <p>ధాన్యానికి మద్దతు ధరగా గ్రేడ్-ఏ రకానికి క్వింటాల్కు రూ. 2,461, సాధారణ రకానికి రూ. 2,441 చెల్లించనున్నారు. దీనికి అదనంగా ప్రభుత్వం గుర్తించిన 7 రకాల సన్న ధాన్యానికి క్వింటాల్కు రూ. 500 చొప్పున బోనస్ అందించనున్నారు. BPT-5204, RNR-15048, జైశ్రీరామ్ వంటి సన్న రకాలకు ఈ బోనస్ వర్తిస్తుంది. విత్తనాలు కొనుగోలు చేసినప్పుడే డీలర్ల వద్ద విత్తన రకాన్ని నమోదు చేసుకున్న రైతులకు ఈ బోనస్ సొమ్ము సులభంగా అందుతుందని మంత్రి వివరించారు.</p> తెలంగాణ(Telangana Government)లోని రైతులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీపి కబురు అందించింది.

అక్టోబర్ 15న ధాన్యం కొనుగోళ్లు
8283 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
క్వింటాల్కు రూ.500 అదనపు బోనస్
Telangana Government: తెలంగాణలోని రైతులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీపి కబురు అందించింది. రాబోయే వానాకాలం సీజన్కు సంబంధించి ధాన్యం కొనుగోళ్లను అక్టోబర్ 15 నుంచి ప్రారంభించేందుకు ముహూర్తం ఖరారు చేసింది. ఈ సీజన్లో దాదాపు రూ. 18,250 కోట్ల విలువైన 65 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్లోని ఎంసీఆర్హెచ్ఆర్డీలో అధికారులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన ఈ కీలక నిర్ణయాలను ప్రకటించారు.