
తొమ్మిది రోజుల పాటు పూజలు పెళ్లికాని యువతులకు ప్రత్యేకం రుద్రంగి(కరీంనగర్): గిరిజన తండా ల్లో సంస్కృతి, ఆచారాలకు అత్యంత ప్రాధాన్యమిస్తారు. సంప్రదాయబద్ధంగా నిర్వహించే పండుగల్లో తీజ్కు ప్రత్యేక స్థానం ఉంది. తీజ్ను కేవలం తండాల్లో పెళ్లి కాని గిరిజన యువతులు మాత్రమే నిర్వహిస్తుంటారు. తమ ఆచార, వ్యవహారాలకు అనుగుణంగా ఆషా ఢం, శ్రావణమాసంలో తీజ్ పండుగను నిర్వహిస్తారు. ఆధునిక కాలంలో ఎన్నో మార్పులు వచ్చినప్పటికి గిరి జనులు తమ సంస్కృతీసంప్రదాయాలను కాపాడుకుం టూ వస్తున్నారు. యువ తుల ప్రత్యేక పూజలు తండాలోని పెద్ద మనిషి సూచనల మేరకు పండుగ జరుపుకొనే రోజును యువతులందరు కలిసి నిర్ణ యించుకుంటారు. యువతులు వారి సోదరులతో కలిసి అడవికి వెళ్లి పుట్టమన్ను సేకరిస్తారు. అల్లిన బుట్టలో పుట్ట మన్ను పోసి గోధుమ గింజలను వేస్తారు. ఇలా చేసిన బుట్టలను తండా పెద్ద మనిషి ఇంటి ఎదుట ఏర్పాటుచేసిన మంచెపై పెడుతారు. గోధుమ గింజలు ఉన్న వెదురు బుట్టలపైన మొలకలు వచ్చే వరకు తొమ్మిది రోజుల పాటు నీళ్లు పోస్తారు. తమ జీవితంలోకి మంచి భాగస్వామి రావాలని, తండాకు మంచి జరగాలని, అందరూ బాగుండాలనే ఉద్దేశంతో తొమ్మిది రోజులు ఉపవాసం ఉంటారు. గిరిజనుల ఆరాధ్యదైవం అయిన సేవాలాల్, మేరమ్మకు పూజలు చేస్తారు. ఉత్సవాల్లో పాల్గొనే యువతులు తొమ్మిది రోజుల పాటు ఉపవాస దీక్ష చేస్తారు. ప్రతి రోజు ఉదయం సాయంత్రం బుట్టలకు నీరు పోస్తారు. తొమ్మిదో రోజు గిరిజన ప్రత్యేక దుస్తులు, ఆభరణాలు ధరించి తండా పెద్ద ఇంటి వద్దకు చేరుకుంటారు. ఊరేగిం పుగా వెళ్లి చెరువులు, వాగుల్లో గోదుమ మొలకలను నిమజ్జనం చేస్తారు. దీంతో పండగ ముగుస్తుంది. ఎక్కడ ఉన్నా సొంతగూటికి.. తొమ్మిది రోజులపాటు జరుపుకొనే తీజ్ వేడుకల్లో పాల్గొనడం కోసం గిరిజనులు ఎక్కడ ఉన్నా తమ తండాలకు చేరుకుంటారు. గిరిజన సంప్రదాయం, ఆచారాలు, సంస్కృతులను కాపాడుకోవడం కోసం ఉన్నత స్థాయిలో ఉద్యోగాలు చేస్తున్న వారు, దూర ప్రాంతాల్లో