
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యరపతినేని శ్రీనివాసరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్సీ అక్రమాల పేరుతో వైసీపీ నేతలు డ్రామాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. గుంటూరు జిల్లా, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యరపతినేని శ్రీనివాసరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్సీ అక్రమాల పేరుతో వైసీపీ నేతలు డ్రామాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. జగన్ ఐదేళ్లు డీఎస్సీ ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. ఒక్క ఉద్యోగం కూడా ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. ఈరోజు(శుక్రవారం) గుంటూరు జిల్లా వేదికగా యరపతినేని మీడియాతో మాట్లాడారు. మంచిని చెడుగా చూపడం వైసీపీ నైజంగా కనిపిస్తోందని యరపతినేని విమర్శించారు. డీఎస్సీ విజేతలు స్వయంగా వచ్చి అంతా సజావుగా జరిగిందని చెప్పారని ప్రస్తావించారు. ఏపీలో జరిగే ప్రతి అభివృద్ధిపై వైసీపీ విషం చిమ్ముతోందని ఆగ్రహించారు. వైసీపీ వంటి రాజకీయ పార్టీ ఉండటం ఏపీకి దురదృష్టమని చెప్పారు. వై నాట్ 175 నుంచి 11 సీట్లు వచ్చినా వారిలో ఆలోచన రావటం లేదని విమర్శించారు. వైసీపీ నేతల మానసిక పరిస్థితిపై అనుమానాలు ఉన్నాయని ఎద్దేవా చేశారు. రోజూ ఎక్కడ శవం దొరుకుతుందా అని వారు ఎదురు చూస్తున్నారని యరపతినేని సెటైర్లు గుప్పించారు. పరామర్శ పేరుతో వ్యవస్థలు ధ్వంసం చేసి, ప్రజలను పోలీసులను ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. రప్పా రప్పా అని నరికి 11కు వచ్చారని.. ఇంకా ఏం నరుకుతారని యరపతినేని శ్రీనివాసరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు