
దేశంలోని లక్షలాది మంది గిగ్ వర్కర్లలో అతడు కూడా ఒకడు. మామూలు స్విగ్గీ డెలివరీ బాయ్గా పనిచేసేవాడు. అయితే తనకు ఎదురైన ఒక ప్రమాదాన్ని అనుకూలంగా మలుచుకున్నాడు. దేశంలోని లక్షలాది మంది గిగ్ వర్కర్లలో అతడు కూడా ఒకడు. మామూలు స్విగ్గీ డెలివరీ బాయ్గా పనిచేసేవాడు. అయితే తనకు ఎదురైన ఒక ప్రమాదాన్ని అనుకూలంగా మలుచుకున్నాడు. ఆసుపత్రి బెడ్ మీద తనలోని కథకుడిని బయటకు తీసుకొచ్చి, లక్షలాది మందిని ఆకట్టుకున్నాడు. ఓ డెలివరీ బాయ్ కథకుడిగా మారి కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నాడు. అతడే... అజిత్కుమార్. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సదరు అ‘సామాన్యుడి’ విజయగాథ ఆద్యంతం ఆసక్తికరం... ఫరీదాబాద్కు చెందిన అజిత్ కుమార్ తండ్రి కుటుంబపోషణ కోసం ఢిల్లీ ఎన్సీఆర్కు వలస వెళ్లారు. కుటుంబాన్ని పోషించడానికి ఆయన చిన్నాచితకా పనులు చేసేవారు. తండ్రి కష్టం చూసీచూసి, డబ్బు విలువ అజిత్కుమార్కు చిన్నతనంలోనే తెలిసొచ్చింది. అయితే అక్క పెళ్లితో కుటుంబ పరిస్థితి మరింత దిగజారిపోయింది. పెళ్లికి చేసిన అప్పుల కారణంగా ఇంటిపోషణలో తాను కూడా భాగం పంచుకోక తప్పలేదు. అప్పటికే వైద్య విద్యను అభ్యసిస్తున్నాడు అజిత్. ఒకవైపు చదువుకుంటూనే ఇంటి అవసరాల కోసం మేకప్, మెహందీ డిజైన్స్ వేస్తూ అంతో ఇంతో సంపాదించేవాడు. అయినా కూడా అప్పులు తీరేవి కావు. సరిగ్గా అదే సమయంలో మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్టు... కొవిడ్ మహమ్మారి అజిత్ కుటుంబాన్ని అతలాకుతలం చేసింది. కొవిడ్ లాక్డౌన్ కారణంగా అజిత్ కాలేజీ మానేయాల్సి వచ్చింది. అప్పటికే అతడు చేసే చిన్న చిన్న పనుల వల్ల ఇల్లు గడవడం కూడా కష్టమైంది. ఏదైనా ఉద్యోగం చేయాలను కున్నాడు. ఒక స్నేహితుడు ఫుడ్ డెలివరీ ప్రయత్నించమని సలహా ఇచ్చాడు. స్విగ్గీ డెలివరీ రైడర్గా పని చేయడం మొదలు పెట్టాడు. ఆ సమయంలో తన దగ్గర సైకిల్ మాత్రమే ఉండేది. రోజుకు 20 ఆర్డర్లను పూర్తి చేయాలంటే కనీసం 100 కిలోమీటర్లు