
సూర్య కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ బాక్సాఫీస్ వద్ద సాలిడ్ వసూళ్లతో దూసుకుపోతోంది. తెలుగు రాష్ట్రాల్లో మంచి బజ్ సొంతం చేసుకున్న ఈ సినిమా, తెలంగాణలో తొలి వారంలోనే కీలక మైలురాయిని నమోదు చేసింది. తెలంగాణలో రూ.20 కోట్ల గ్రాస్.. రూ.11 కోట్ల షేర్ ఈ చిత్రం తెలంగాణ వ్యాప్తంగా మొదటి వారంలో రూ.20 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించగా, దాదాపు రూ.11 కోట్ల వరకు షేర్ రాబట్టింది. తద్వారా తెలంగాణలో తొలి వారంలోనే ఈ ఘనత సాధించిన రెండో తమిళ కథానాయకుడిగా సూర్య నిలిచారు. మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రం, సింగిల్ స్క్రీన్స్ నుంచి మల్టీప్లెక్స్ల వరకు అన్ని కేంద్రాల్లోనూ స్ట్రాంగ్ ఆక్యుపెన్సీతో ప్రదర్శితమవుతోంది. కుటుంబ ప్రేక్షకులతో పాటు యువత నుంచి లభిస్తున్న ఆదరణ చిత్ర వసూళ్లకు ప్రధాన బలంగా నిలిచింది
.