
ఈనాడు, దిల్లీ: మార్గదర్శి ఫైనాన్షియర్స్ వ్యవహారంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నిజాయతీకి దక్కిన మహోన్నత విజయమని పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ‘‘రామోజీరావు హిమాలయమంత ధైర్యం, ఆత్మవిశ్వాసంతో నిందారోపణలను ఎదుర్కొని సుదీర్ఘ న్యాయపోరాటం చేశారు. అంతిమంగా ధర్మమే గెలిచింది. సర్వోన్నత న్యాయస్థానం వెలువరించిన చరిత్రాత్మక తీర్పు నిజాయతీకి దక్కిన మహోన్నత విజయం’’ అని ఆయన శుక్రవారం ఎక్స్లో వెల్లడించారు. మార్గదర్శి మేనేజరుకు చిట్ వాయిదా చెక్కును అందజేస్తున్న ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, నిఖిలనాయుడు శ్రీకాకుళం పాతబస్టాండ్, న్యూస్టుడే: ఖాతాదారుల మనోభావాలను ప్రతిబింబించేలా మార్గదర్శి కేసులో సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు ఇచ్చిందని ఏపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పేర్కొన్నారు. శ్రీకాకుళంలోని మార్గదర్శి కార్యాలయానికి శుక్రవారం కుటుంబసమేతంగా వచ్చిన ఆయన కేకు కోసి సిబ్బందికి స్వీట్లు పంచారు. మార్గదర్శి సంస్థలో పొదుపు చేసిన తన తొలి ఆదాయంతోనే వివాహానంతరం సొంతింటి కలను నెరవేర్చుకున్నానని గుర్తుచేసుకున్నారు. తమ కుటుంబ ఆర్థిక ఎదుగుదలలో మార్గదర్శి సోపానంగా నిలిచిందని పేర్కొన్నారు. ధర్మం, నిబద్ధత, నిజాయతీలే కొలమానంగా రామోజీ గ్రూపు సంస్థలు ఉన్నత విలువలతో నడుస్తాయనేది జగమెరిగిన సత్యమన్నారు. ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్న తమ కుమార్తె నిఖిలనాయుడు రూ.25 లక్షల చిట్ గ్రూపులో చేరి బంధాన్ని మరింతగా బలపర్చిందన్నారు. ఏపీ సాంఘిక సంక్షేమ బోర్డు ఛైర్మన్ పోతుల బాలకోటయ్య ఈనాడు, అమరావతి: మార్గదర్శిపై ఉండవల్లి అరుణ్కుమార్ వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేయడాన్ని ఏపీ సాంఘిక సంక్షేమ బోర్డు ఛైర్మన్ పోతుల బాలకోటయ్య స్వాగతించారు. ‘ఈ తీర్పుతో ధీశాలి ఆత్మ స్వర్గాన సంతోషించి ఉంటుంది. 18 ఏళ్లుగా ఈకేసును అటూ ఇటూ తిప్పారు. పూటకో అబద్ధం వండి వార్చారు. కానీ చివరకు నమ్మకం, నిజాయతీ గెలిచాయి. అబద్ధం ఓడింది’ అని ఎక్స్లో పోస్టు చేశారు. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఈనాడు, అమరావతి: లక్షల మంది డిపాజిటర్ల నమ్మకం పొందిన మార్గదర్శి ఫైనాన్సియర్స్ను భ్రష్టుపట్టించాలని కొందరు చేసిన కుట్రలు రెండు దశాబ్దాల న్యాయపోరాటంతో పటాపంచలయ్యాయని