
ప్రపంచ ఇంధన రవాణాకు గుండెకాయలాంటి హర్మూజ్ జలసంధి ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ కీలక సముద్ర మార్గంపై ఇరాన్ ఆధిపత్యం క్రమంగా తగ్గుతోందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అమెరికా నౌకాదళం కొనసాగిస్తున్న దిగ్బంధం, ప్రత్యామ్నాయ మార్గాల్లో పెరుగుతున్న నౌకల రాకపోకలు ఇందుకు కారణంగా నిలుస్తున్నాయి. దీంతో యుద్ధం మొదలైన తర్వాత తొలిసారిగా హర్మూజ్పై ఇరాన్ పట్టు బలహీనపడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.ట్రాఫిక్ దారి మారిందిసముద్ర నౌకల కదలికలను పర్యవేక్షించే మెరైన్ట్రాఫిక్ గణాంకాల ప్రకారం.. గత వారం హర్మూజ్ జలసంధిని కనీసం 95 నౌకలు దాటాయి. అంతకుముందు వారంలో ఈ సంఖ్య 118గా ఉంది. అయితే నౌకలు ఎంచుకుంటున్న మార్గంలో కీలకమైన మార్పు కనిపించింది. గత రెండు వారాల్లో హర్మూజ్ దాటిన నౌకల్లో దాదాపు 80 శాతం ఒమన్ వైపు ఉన్న ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకున్నాయి.ఈ మార్గాన్ని ఐక్యరాజ్యసమితి అనుమతించింది. అయితే దీన్ని ఇరాన్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇరాన్ హెచ్చరికలను పట్టించుకోకుండా అమెరికా రక్షణపై నమ్మకంతో నౌకలు ఈ మార్గంలో సాగుతున్నాయి.టోల్ వసూలు చేసే అవకాశం తగ్గిందిఇరాన్ సూచించిన మార్గాన్ని నౌకలు ఎంచుకోకపోవడంతో ఆ దేశానికి మరో దెబ్బ తగిలింది. జలసంధి మీదుగా వెళ్లే నౌకల నుంచి టోల్ వసూలు చేసే అవకాశం తగ్గింది. మధ్యప్రాచ్య దేశాలు కూడా ఈ విధానాన్ని అంగీకరించేందుకు ఆసక్తి చూపడం లేదు.చీకటి నౌకల రాకపోకలుసౌదీ అరేబియా, కువైట్, యూఏఈ వంటి చమురు ఉత్పత్తి దేశాలు భారీ చమురు నౌకలను హర్మూజ్ మీదుగా పంపిస్తున్నాయి. గల్ఫ్ ఆఫ్ ఒమన్ దాటిన తర్వాత అక్కడి నుంచి ఇతర