ఘట్టమనేని కుటుంబం నుంచి మరో వారసుడు వెండితెరకు పరిచయమైన చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’. సూపర్ స్టార్ కృష్ణ మనవడు, దివంగత రమేశ్ బాబు కుమారున జయకృష్ణ ఈ సినిమాతో కథానాయకుడిగా ఎంట్రీ ఇచ్చారు. వైవిధ్యభరిత చిత్రాల దర్శకుడు అజయ్ భూపతి రూపొందించిన ఈ రొమాంటిక్ యాక్షన్ డ్రామాపై విడుదలకి ముందు భారీ అంచనాలు నెలకొన్నాయి. జూలై 30న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద మాత్రం ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది. మిక్స్డ్ రెస్పాన్స్ రావడంతో థియేటర్లలో ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక నిరాశపరిచింది.21 రోజులకే ఓటీటీలోకిథియేట్రికల్ రన్ను ముగించుకున్న ఈ చిత్రం విడుదలైన కేవలం మూడు వారాల్లోనే (21 రోజులకు) డిజిటల్ ప్లాట్ఫామ్లోకి అడుగుపెట్టింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో గురువారం (ఆగస్టు 20) నుంచి ‘శ్రీనివాస మంగాపురం’ స్ట్రీమింగ్ ప్రారంభమైంది. పలు భాషల్లో ఏకకాలంలో డిజిటల్ వీక్షకులకు అందుబాటులోకి వచ్చిన ఈ చిత్రం, థియేటర్లలో మిస్ అయిన సినీ ప్రియులను ఓటీటీ ద్వారా ఎంతవరకు మెప్పిస్తుందో వేచి చూడాలి.* నా చంద్రకళ మీదే చెయ్యేస్తార్రా.. రౌడీల్ని ఇరగదీసిన భట్టు.ఆసక్తికరమైన ప్రేమ ప్రయాణంఈ చిత్రంలో జయకృష్ణ సరసన బాలీవుడ్ స్టార్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడానీ హీరోయిన్గా నటించింది. కథ విషయానికి వస్తే.. శ్రీను (జయకృష్ణ) ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే అమ్మాయి మంగ (రాషా). మొదట్లో అతని ప్రేమని కాదన్నా, శ్రీను చూపే స్వచ్ఛమైన ప్రేమకు ముగ్ధురాలై మంగ కూడా మనసిస్తుంది. అంతా సాఫీగా సాగుతుందనుకున్న తరుణంలో, వీరి ప్రేమకథలోకి బళ్లారి వెంకటప్పయ్య నాయుడు (మోహన్ బాబు) ప్రవేశించడంతో ఎన్నో మలుపులు చోటుచేసుకుంటాయి. అసలు ఈ జంటకు, వెంకటప్పయ్య నాయుడికి ఉన్న వైరం ఏమిటి?... పెద్దిరెడ్డి (శ్యామ్) నేపథ్యం ఏమిటి?... శ్రీను తన గుర్తింపును మార్చుకుని వాసుబాబుగా ఎందుకు మారాల్సి వచ్చింది?... చివరికి అన్ని అడ్డంకులను దాటుకుని శ్రీను-మంగల ప్రేమ గెలిచిందా? లేదా? అన్న అంశాల