
దిగ్గజ నటి షావుకారు జానకి (Sowcar Janaki) మృతి పట్ల యావత్ సినీ పరిశ్రమ విచారంలో మునిగిపోయింది. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు తీవ్ర సంతాపం ప్రకటించారు. షావుకారు జానకి పార్థివదేహాన్ని తమిళనాడు, తేనాంపేటలో ఉన్న ఆమె స్వగృహంలో శనివారం మధ్యాహ్నం వరకు అభిమానుల సందర్శనార్థం వుంచి, సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించనున్నామని షావుకారు జానకి మనవరాలు, నటి వైష్ణవి భర్త అరవింద్ శుక్రవారం మీడియాకు వెల్లడించారు. చెరగని ముద్ర: సీఎం విజయ్ తనదైన ప్రత్యేక నటనతో తరతరాలుగా అభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన సీనియర్ నటి షావుకారు జానకి మరణ వార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి, దుఃఖానికి గురయ్యానని ముఖ్యమంత్రి విజయ్ తన ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని వ్యక్తం చేశారు. ఇదే విషయంపై ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘‘సినీ పరిశ్రమలో 70 యేళ్ళకుపైగా లెక్కలేనన్ని పాత్రలకు జీవం పోసిన ఆమె కళాత్మక ప్రస్థానం కూడా ప్రశంసనీయం. తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ వంటి భాషా చిత్రాల్లో నటించి పద్మశ్రీ, కలైమామణి, నంది పురస్కారాలతోపాటు అనేకఅవార్డులు అందుకున్న షావుకారు జానకి మృతి సినీ పరిశ్రమకు తీరని లోటు. జానకి మరణంతో దుఃఖసాగరంలో ఉన్న ఆమె కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు, చిత్రపరిశ్రమకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి. ఆమె ఆత్మకు భగవంతుని పాదాల చెంత శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను’’ అని సీఎం విజయ్ విడుదల చేసిన సంతాప సందేశంలో పేర్కొన్నారు. ఒక శకం ముగిసింది: టీఎఫ్ఏపీఏ షావుకారు జానకి మృతిపట్ల తమిళ చిత్ర యాక్టివ్ నిర్మాతల సంఘం (టీఎఫ్ఏపీఏ) కార్యవర్గం, సభ్యులు తమ ప్రగాఢ సంతాపం, సానుభూతి వ్యక్తం చేస్తూ ఒక ప్రకటనను విడుదల చేసింది. భారతీయ చిత్రపరిశ్రమలోని గొప్ప, అత్యంత గౌరవనీయ నటీమణుల్లో ఒకరైన షావుకారు జానకి మృతి తీవ్ర విచారాన్ని కలిగించింది. ఏడు దశాబ్దాలకు పైగా తన అపారమైన నటనతో తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం చిత్రపరిశ్రమలను సుసంపన్నం