
డ్రగ్స్ రవాణాపై ఉమ్మడి పోరాటం, ఆర్థిక కారిడార్ల నిర్మాణం, బ్లూ ఎకానమీ విస్తరణ, దక్షిణాది రాష్ట్రాల ఉమ్మడి ప్రయోజనాల పరిరక్షణ కోసం అన్ని రాష్ట్రాలు సహకారంతో ముందుకు సాగాలని తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ పిలుపునిచ్చారు. చెన్నైలో 31వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ పలు కీలక అంశాలను ప్రస్తావించారు. దేశ జీడీపీలో 30 శాతానికి పైగా వాటా కలిగిన దక్షిణాది రాష్ట్రాలు తయారీ, ఎగుమతులు, సేవల రంగాల్లో కేంద్రంగా నిలుస్తున్నాయని ఆయన గుర్తుచేశారు.ఆర్థిక కూటమిగా ఎదగాలితయారీ జోన్లు, లాజిస్టిక్స్ పార్కులు, ఫ్రైట్ కారిడార్ల ద్వారా దక్షిణ ప్రాంతం ఒక సమీకృత ఆర్థిక కూటమిగా పనిచేయాలని సీఎం విజయ్ ఆకాంక్షించారు. బెంగళూరులోని బొమ్మసంద్ర నుంచి హోసూర్ వరకు మెట్రో రైలు విస్తరణను స్వాగతించిన ఆయన, ఇది అంతర్రాష్ట్ర సహకారానికి ఒక నమూనా అని అభివర్ణించారు. ఈ పనులను వేగవంతం చేయాలని అధికారులను కోరారు.'డ్రగ్స్ రహిత దక్షిణ భారతం' కోసం మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై నిఘా సమాచారాన్ని పంచుకుంటూ, కఠినంగా వ్యవహరించాలని సూచించారు. ఆన్లైన్లో మందుల విక్రయాలపై నియంత్రణ, అనధికార పంపిణీపై చర్యలు తీసుకోవాలని కోరారు.సముద్ర తీరంతో అభివృద్ధిదక్షిణాది అభివృద్ధిలో బ్లూ ఎకానమీకి ప్రాధాన్యత ఇవ్వాలని విజయ్ అన్నారు. 1,076 కిలోమీటర్ల తీరప్రాంతం ఉన్న తమిళనాడు.. పోర్టులు, తీరప్రాంత నౌకాయానం, మత్స్య పరిశ్రమ, సముద్ర ఆధారిత పరిశ్రమలు, పర్యాటకం వంటి రంగాల్లో ఇతర రాష్ట్రాలతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉందని ప్రకటించారు. ఆర్థిక సమాఖ్య విధానంపై మాట్లాడుతూ.. రాబోయే ఫైనాన్స్ కమిషన్ నిధుల కేటాయింపులో రాష్ట్రాల అవసరాలు, పనితీరు