© 2026 nimisham.in

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్, లైఫ్స్టైల్, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది. Southern Railway Apprentice Recruitment 2026: సదరన్ రైల్వే తన అప్రెంటిషిప్ శిక్షణ కోసం మొత్తం 4,471 ట్రైనింగ్ స్లాట్లను వివిధ విభాగాలుగా విభజించి భర్తీ చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా 163 మంది ఫ్రెషర్స్, మిగిలిన 438 మంది ఐటిఐ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. సదరన్ రైల్వే వివిధ వర్క్షాప్లలో వేర్వేరు కేటగిరీల కింద అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 27వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు తమ దరఖాస్తులను తప్పనిసరిగా సమర్పించాలి. అయితే, దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు తమ విద్యా అర్హతలు నోటిఫికేషన్లోని నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయో లేదో నోటిఫికేషన్ను పూర్తిగా చదివి నిర్ధారించుకోవాలి. ఈ అప్రెంటిషిప్ ట్రైనింగ్ అనేది కేవలం శిక్షణ కోసం మాత్రమే, ఇది భవిష్యత్తులో రెగ్యులర్ ఎంప్లాయిమెంట్ గ్యారెంటీని ఇవ్వదు. సదరన్ రైల్వే అప్రెంటిస్ స్టైఫెండ్ 2026 వివరాలు.. సదరన్ రైల్వేలో అప్రెంటిస్గా పనిచేసే అభ్యర్థులకు లభించే స్టైఫెండ్ అనేది వారు ఎంచుకున్న కేటగిరీ, అర్హతపై ఆధారపడి ఉంటుంది. వివరాల ప్రకారం, క్లాస్ 10 పూర్తి చేసిన ఫ్రెషర్స్ నెలకు రూ. 8,200 పొందుతారు. అలాగే, క్లాస్ 12 పూర్తి చేసిన ఫ్రెషర్స్, ఐటిఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు నెలకు రూ. 9,600 స్టైఫెండ్ పొందుతారు. దరఖాస్తు రుసుము, శిక్షణ వివరాలు.. దరఖాస్తు ప్రక్రియ కోసం అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా రూ.100 ప్రాసెసింగ్ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఎస్సీ, ఎస్టీ, పిడబ్ల్యూ, బీడీ, మహిళా అభ్యర్థులకు ఎలాంటి దరఖాస్తు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఫ్రెషర్స్ కోసం శిక్షణ కాలపరిమితిని
బట్టి వెల్డర్, మెడికల్ లాబరేటరీ టెక్నీషియన్ వంటి విభాగాల్లో ఒక సంవత్సరం మూడు నెలల పాటు ఫిల్టర్, పెయింటర్ వంటి విభాగాల్లో రెండు సంవత్సరాల పాటు శిక్షణ ఇస్తారు. ఐటిఐ అభ్యర్థులకు ఈ శిక్షణ ప్రక్రియలో ప్రత్యేక రిబేట్లు, ప్రయోజనాలు వర్తిస్తాయి.
సదరన్ రైల్వే అప్రెంటిసిప్ ముఖ్యమైన తేదీలు, ఎంపిక విధానం.. ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ సెప్టెంబర్ 27వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తిగా మెరిట్ లిస్ట్ ఆధారంగా జరుగుతుంది. విద్యార్థుల మార్కుల ఆధారంగా మెరిట్ జాబితాను తయారు చేస్తారు, ముఖ్యంగా ఐటిఐ అభ్యర్థులకు వారి మెరిట్ ఆధారంగా తగిన వెయిటేజీని అందిస్తారు. ఎంపికైన అభ్యర్థుల డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రక్రియను అక్టోబర్ 15వ తేదీన నిర్వహించనున్నారు. కాబట్టి, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఎప్పటికప్పుడు అధికారిక నోటిఫికేషన్ను తనిఖీ చేస్తూ, ఖాళీల వివరాలను ఇతర నిబంధనలను ముందుగానే తెలుసుకొని దరఖాస్తు చేసుకోవాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.