
ఒక చిన్న చిలిపి ప్రాంక్.. భారత క్రికెట్ జట్టులో తీవ్ర కలకలం రేపింది. ఏకంగా కెప్టెన్ సౌరవ్ గంగూలీ తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించేంత వరకు వెళ్లింది. ఈ ఆసక్తికరమైన సంఘటనను భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. 2005లో పాకిస్థాన్తో వన్డే సిరీస్కు ముందు కొచ్చిలో జరిగిన ఈ ఘటన అప్పట్లో డ్రెస్సింగ్ రూమ్లో పెను నాటకీయతకు దారితీసింది.ఏప్రిల్ 1న, అంటే ఏప్రిల్ ఫూల్స్ డే రోజున యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్ కలిసి కెప్టెన్ గంగూలీపై ప్రాంక్ చేయాలని నిర్ణయించుకున్నారు. జట్టు సభ్యులందరూ పార్టీలకు అలవాటు పడ్డారని, బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారని గంగూలీ విమర్శించినట్లు కొన్ని ఫేక్ వార్తాపత్రిక క్లిప్పింగ్స్ను సృష్టించారు. వాటిని తీసుకుని డ్రెస్సింగ్ రూమ్లో ఉన్న గంగూలీ వద్దకు వెళ్లారు. "దాదా.. ప్రెస్కు మీరు ఇచ్చిన ఈ స్టేట్మెంట్ ఏంటి?" అంటూ యువరాజ్ నాటకాన్ని ప్రారంభించాడు. ఆ క్లిప్పింగ్స్ చూడగానే గంగూలీ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాడు."నేను అలా అనలేదు. ఒకవేళ అన్నట్లు నిరూపిస్తే కెప్టెన్సీ వదిలేస్తా" అని గంగూలీ చెప్పాడు. పరిస్థితి మరింత నమ్మశక్యంగా ఉండటానికి, సీనియర్ ఆటగాళ్లు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్ కూడా ఈ నాటకంలో భాగమయ్యారు. "నువ్వు ఇలా చేసి ఉండాల్సింది కాదు" అని సచిన్, ద్రావిడ్ అనడంతో గంగూలీ పూర్తిగా నమ్మేశాడు. దీంతో అతనిలో ఆందోళన మరింత పెరిగింది. ఈ క్రమంలో హర్భజన్, మరికొందరు ఆటగాళ్లు తమ కిట్ బ్యాగులు తీసుకుని డ్రెస్సింగ్ రూమ్ నుంచి బయటకు నడవడం