
భార్య బస్సు క్లీనర్తో వెళ్లిపోయిందని సీసీటీవీ ఫుటేజ్ను విడుదల చేశాడు ఇన్ఫ్లుయెన్సర్ అఖిల్ ..! సోషల్ మీడియాలో కనిపిస్తే ఎప్పుడూ నవ్వులు.. క్యూట్ వీడియోలు.. ఫ్యామిలీ వ్లాగ్స్.. ట్రావెల్ రీల్స్.. ఇలా లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న కేరళకు చెందిన సోషల్ మీడియా జంట అఖిల్–మేఘా.... ఒకప్పుడు ఈ జంట వీడియోలకు ఫిదా అయిన నెటిజన్లు.. ఇప్పుడు అదే జంటకు సంబంధించిన ఓ సంచలన ఆరోపణలు చూసి షాక్ అవుతున్నారు. తన భార్య మేఘా ఓ స్థానిక బస్సు క్లీనర్తో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయిందంటూ అఖిల్ తాజాగా విడుదల చేసిన వీడియోలో ఆరోపించడం కలకలం రేపుతోంది. అంతేకాదు.. ఇంట్లో ఉన్న నగదు, బంగారం, విలువైన వస్తువులు కూడా ఆమె వెంట తీసుకెళ్లిందని అఖిల్ చెప్పినట్లు వైరల్ పోస్టుల్లో పేర్కొంటున్నారు. ఈ ఆరోపణలకు సంబ ధించిన కొన్ని దృశ్యాలను కూడా ఆయన సోషల్ మీడియాలో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు సోషల్ మీడియాలో ఈ జంటను చూసినవారికి వారి జీవితం ఓ పర్ఫెక్ట్ ఫ్యామిలీలా కనిపించేది. కానీ అఖిల్ వీడియో బయటకు రావడంతో.. తెరపై కనిపించిన చిరునవ్వుల వెనుక అసలు కథ ఏమిటన్న చర్చ మొదలైంది.తాను తీవ్ర మానసిక వేదనలో ఉన్నానని.. కుటుంబం ఎదుర్కొంటు న్న పరిస్థితి తనను తీవ్రంగా కలచివేస్తోందని అఖిల్ వీడియోలో పేర్కొన్నట్లు సమాచారం. అయితే ఈ ఆరోపణలపై మేఘా నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక స్పందన వెలువడినట్లు స్పష్టమైన సమాచారం లేదు. ఆమె నిజంగా ఇంటి నుంచి వెళ్లిపోయిందా? ఎవరితో వెళ్లింది? నగదు, బంగారం తీసుకెళ్లిందన్న ఆరోపణల్లో నిజమెంత? అసలు ఈ దంపతుల మధ్య ఏం జరిగింది? అనే ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉంది. ప్రస్తుతం అఖిల్ వాదన మాత్రమే వైరల్ అవుతుంది. మేఘా స్పందన లేదా అధికారిక దర్యాప్తు వివరాలు వెలుగులోకి వచ్చిన తర్వాతే ఈ వ్యవహారంలో పూర్తి వాస్తవాలు స్పష్టమయ్యే అవకాశం ఉంది. ఈ ఘటన మరో