
ప్రతి నెలా కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తుండటంతో చాలా కుటుంబాలు ఖర్చు తగ్గించుకునే మార్గాలు వెతుకుతుంటాయి. అయితే కరెంటు ఆదా చేయడానికి పెద్ద ఉపకరణాల వాడకం తగ్గించడమే కాదు, వాడని ఎలక్ట్రానిక్ పరికరాలను ప్లగ్లో ఉంచకుండా తీసేయడం కూడా ముఖ్యం. రాత్రి పడుకునే ముందు అనవసరమైన ఛార్జర్లు, అడాప్టర్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను అన్ప్లగ్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. దీనికోసం “ఛార్జ్ ఇట్ రైట్, అన్ప్లగ్ ఎట్ నైట్” అనే నినాదాన్ని కూడా ప్రచారం చేస్తున్నారు. ముందుగా ఫోన్ ఛార్జర్ విషయం చూద్దాం. రాత్రి పడుకునే ముందు ఫోన్కు ఛార్జింగ్ పెట్టి, అది పూర్తయ్యాక ఛార్జర్ను సాకెట్ నుంచి తీసేయాలి. అలాగే వాడని అడాప్టర్లు, ఇతర ఎలక్ట్రానిక్ యాక్సెసరీలను కూడా అన్ప్లగ్ చేయడం మంచిది. రాత్రంతా రౌటర్ ఆన్లో ఉండాల్సిన అవసరం లేనివాళ్లు, దాన్ని కూడా ఆఫ్ చేయొచ్చు. అయితే ఇంట్లో సెక్యూరిటీ సిస్టమ్స్, స్మార్ట్ డివైజ్లు లేదా నిరంతరం ఇంటర్నెట్ అవసరమయ్యే పరికరాలు ఉంటే, వాటిని మాత్రం ఆపొద్దు. స్టాండ్బై మోడ్లో ఉన్న కొన్ని ఎలక్ట్రానిక్ పరికరాలు, పూర్తిగా స్విచ్ ఆఫ్ చేసినా కూడా సాకెట్లో ప్లగ్ చేసి ఉంటే కొద్దిగా కరెంటును వాడుకుంటాయి. దీన్నే 'స్టాండ్బై పవర్' లేదా 'వాంపైర్ పవర్' అంటారు. ఒక్క ఛార్జర్ను అన్ప్లగ్ చేయడం వల్ల వెంటనే పెద్ద మొత్తంలో డబ్బు ఆదా అవుతుందని అనుకోవద్దు. ఎందుకంటే ప్రతి పరికరం వాడే కరెంటు వేర్వేరుగా ఉంటుంది. కానీ వాడని చాలా పరికరాలను ప్లగ్లో ఉంచకుండా తీసేస్తే, దీర్ఘకాలంలో కరెంటు వృథాను తగ్గించవచ్చు. రాత్రిపూట కొన్ని పరికరాలను అన్ప్లగ్ చేయడం వల్ల కరెంటు ఆదా అవ్వడమే కాదు, వాటి భద్రత కూడా పెరుగుతుంది. పవర్ సప్లైలో హెచ్చుతగ్గులు (ఫ్లక్చుయేషన్స్) లేదా సర్జ్లు వచ్చినప్పుడు, సున్నితమైన ఎలక్ట్రానిక్ పరికరాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. అందుకే వాడని ఛార్జర్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను అన్ప్లగ్ చేయడం మంచిది. కానీ ఫ్రిజ్, మెడికల్ పరికరాలు