© 2026 nimisham.in
ఆహారాన్ని తినేటప్పుడు బాగా నమలండి. నెమ్మదిగా తినండి. దీని వల్ల లాలాజలంలో ఆహారంతో బాగా కలుస్తుంది. ఫలితంగా కడుపుపై పనిభారం తగ్గుతుంది. ఆహారం సులభంగా జీర్ణం అవుతుందని హెల్త్లైన్ తెలిపింది. ఫైబర్ ఎక్కువగా ఉన్న పండ్లు, కూరగాయలు, పప్పులు తినడం వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. అజీర్తి, మలబద్దకం తగ్గుతుంది. తిన్న ఆహారం బాగా జీర్ణం అయ్యేందుకు ఎక్కువగా నీరు తాగాలి. నీరు బాగా తాగడం వల్ల కొవ్వులు, ఫైబర్ ఫుడ్ బాగా కరుగుతాయి. వ్యర్థాలు సులభంగా బయటకుపోతాయి. పెరుగు, కిమ్చీ, మజ్జిగ వంటి ఆహారాలు తీసుకోవడం వల్ల జీర్ణాశయంలో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. దీంతో జీర్ణ సంబంధిత సమస్యలు రావు. ప్రతిరోజూ వ్యాయామం చేయండి. రన్నింగ్, వాకింగ్, యోగా చేయడం వల్ల జీర్ణాశయంలో కండరాల కదలిక బాగుంటుంది. దీంతో ఆహారం బాగా జీర్ణం అవుతుంది. ఓవర్గా తినడం వల్ల కూడా జీర్ణ సమస్యలు వస్తాయి. మీ కడుపు 70 నుంచి 90 శాతం నిండిందని మీకు అనిపిస్తే తినడం ఆపేయండి. ఇలా చేస్తే జీర్ణాశయంపై అదనపు బారం పడదు. రాత్రి భోజనానికి నిద్రకి మధ్యలో రెండు గంటల గ్యాప్ ఉండేలా చూడండి. దీంతో యాసిడ్ రిఫ్లెక్స్ రాదు. పడుకునే ముందు మితంగా ఆహారాన్ని తినండి. రోజులో 8 గంటల పాటు ప్రశాంతంగా నిద్రపోండి. దీని వల్ల కండరాలు అన్నీ రిలాక్స్ అవుతాయి. రిపేర్ అవుతాయి. గట్ మైక్రోబయోమ్ కూడా సమతుల్యంగా ఉంటుంది. ప్రతిరోజూ ఒకే సమయానికి ఆహారం తినండి. దీని వల్ల జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. ప్రతిసారి తక్కువ మోతాదులోనే తినండి
.