
మహారాష్ట్ర రాజకీయాల్లో కొంతకాలంగా సాగుతున్న ఊహాగానాలకు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ తెరదించారు. తమ పార్టీ ఎన్డీయేలో చేరబోదని స్పష్టం చేశారు. ప్రతిపక్షంలోనే కొనసాగుతామని పార్టీ నేతలకు తేల్చి చెప్పారు. ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని ఆదేశించారు.వారాంతంలో జరిగిన రెండు రోజుల పార్టీ సమావేశంలో శరద్ పవార్ ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేలో చేరతారన్న ప్రచారాన్ని పట్టించుకోవద్దని పార్టీ శ్రేణులకు సూచించారు. మహారాష్ట్రతో పాటు జాతీయ స్థాయిలోనూ సమర్థమైన ప్రతిపక్షంగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.అజిత్ పవార్ వర్గంతో మళ్లీ కలుస్తారన్న ప్రచారానికి కూడా తాజా నిర్ణయంతో తెరపడినట్లయింది. దీంతో మహారాష్ట్రలోని మహా వికాస్ అఘాడీ కూటమికి ఊరట లభించింది. శివసేన (ఉద్ధవ్ ఠాక్రే), కాంగ్రెస్తో కలిసి ప్రతిపక్ష పోరాటాన్ని కొనసాగించేందుకు మార్గం సుగమమైంది.ఇటీవల శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ ఎంపీలు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. సుప్రియా సూలే, బజరంగ్ సోనావణే నేతృత్వంలో ఎనిమిది మంది లోక్సభ సభ్యులు ఈ భేటీలో పాల్గొన్నారు. శరద్ పవార్ కూడా ప్రభుత్వ పెద్దలను కలవడంతో పార్టీ ఎన్డీయే వైపు వెళుతుందన్న ప్రచారం ఊపందుకుంది.అయితే నియోజకవర్గాల అభివృద్ధి, రైతుల సమస్యలు, ప్రజా ప్రయోజనాల కోసమే ఇలాంటి భేటీలు జరుగుతున్నాయని ఎన్సీపీ (ఎస్పీ) స్పష్టం చేసింది. వీటికి పార్టీ రాజకీయ వైఖరితో సంబంధం లేదని తెలిపింది.పార్టీ మహారాష్ట్ర అధ్యక్షుడు శశికాంత్ షిండే కూడా తమ భవిష్యత్ కార్యాచరణను వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు, వర్క్షాప్లు, సమావేశాలు నిర్వహించనున్నట్లు