© 2026 nimisham.in

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్సైట్కు సంబంధించిన వీడియో కంటెంట్పై కూడా అవగాహన ఉంది.. Shabad Case Update: షాబాద్ మండలంలో జరిగిన ఆరుగురి దారుణ హత్యల ఉదంతం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.. ఈ మారణహోమానికి ఒడిగట్టిన ప్రధాన నిందితుడు రాజ్కుమార్ను పోలీసులు ఎలా అదుపులోకి తీసుకున్నారనే.. విషయంపై ఇప్పుడు ఒక ఆసక్తికరమైన అంశం వెలుగులోకి వచ్చింది. కొత్తూరు మండలం కుమ్మరిగూడెం గ్రామానికి చెందిన బండారు సుధాకర్ అనే వ్యక్తి.. తాను నిందితుడు రాజ్కుమార్ను ప్రత్యక్షంగా చూశానని వెల్లడించారు. నిందితుడిని చూసి షాకయ్యాను.. ప్రత్యక్ష సాక్షి బండారు సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. షాబాద్లో ఘోరానికి ఒడిగట్టిన తర్వాత నిందితుడు రాజ్కుమార్ తప్పించుకునే క్రమంలో కుమ్మరిగూడెం పరిసర ప్రాంతాల్లో తిరిగడని తెలుస్తోంది.. అయితే, తను రోడ్డుపై వెళ్తుండగా ఒక వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడని.. అతడే ఆరుగురిని చంపిన కిరాతకుడు రాజ్కుమార్ అని తెలిసి ఒక్కసారిగా షాక్కు గురయ్యాడని బండారు సుధాకర్ తెలిపారు.. ఇంత దారుణానికి ఒడిగట్టి కూడా ఎలాంటి భయం లేకుండా తిరుగుతున్న అతడిని చూసి ఏం చేయాలో తెలియలేదని సుధాకర్ పేర్కొన్నారు. క్షణాల వ్యవధిలో చుట్టుముట్టిన పోలీసులు.. తాను నిందితుడిని గమనించిన కొద్దిసేపటికే.. ఊహించని విధంగా పోలీసులు అక్కడకు చేరుకున్నారని సుధాకర్ వివరించారు. చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించిన పోలీసులు.. నిందితుడు రాజ్కుమార్కు తప్పించుకునే అవకాశం ఇవ్వకుండా చుట్టుముట్టారని చెప్పారు. నిందితుడి కదలికలపై నిఘా ఉంచిన పోలీసులు క్షణాల వ్యవధిలోనే రంగంలోకి దిగిన్నట్లు తెలుస్తోంది. రాజ్కుమార్ కోలుకునే లోపే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని.. అక్కడి నుంచి వాహనంలో తరలించారని ప్రత్యక్ష సాక్షి
తెలిపాడు.. కిరాతకుడు పట్టుబడటంతో కుమ్మరిగూడెం సహా పరిసర గ్రామాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ ఘోర హత్యల నేపథ్యంలో షాబాద్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. నిందితుడు రాజ్కుమార్ను కఠినంగా శిక్షించాలని.. బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని స్థానికులు, గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఈ కేసులో స్థానిక పోలీస్ అధికారుల నిర్లక్ష్యం కూడా ఉందనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో.. ఉన్నతాధికారులు ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.