© 2026 nimisham.in
తిరుమల శ్రీవారి పేరుతో నిర్వహించే సంస్థకు ఎస్బీఐ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) భారీ విరాళం అందించింది.. అలాగే తిరుపతి ఐఐటీకి మరో విరాళాన్ని ఇచ్చారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీఎస్ఆర్ (కార్పొరేట్ సామాజిక బాధ్యత) కింద సమాజ శ్రేయస్సు, ప్రజావైద్యం, పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా దాదాపు రూ.87.26 లక్షల విరాళాలను అందించారు. ఈ రెండు విరాళాలకు సంబంధించి వేర్వేరుగా కార్యక్రమాలను నిర్వహించారు. బ్యాంక్ ఛైర్మన్ చల్లా శ్రీనివాసులుశెట్టి, ఉన్నతాధికారులు హాజరై చెక్కుల్ని అందజేశారు.ఎస్బీఐ తిరుపతిలోని స్విమ్స్ అనుబంధ శ్రీపద్మావతి ఉమెన్స్ మెడికల్ కాలేజీలో పిడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్, అత్యాధునిక వైద్య పరికరాల ఏర్పాటుకు రూ.57.23 లక్షలు ఇచ్చింది. ఎస్బీఐ ఛైర్మన్ చల్లా శ్రీనివాసులుశెట్టి స్విమ్స్ డైరెక్టర్, వీసీ డాక్టర్ జి.జగదీష్కు ఈ విరాళానికి సంబంధించిన చెక్కును అందజేశారు. అనంతరం తిరుపతి ఐఐటీ ప్రాంగణంలోని విద్యార్థులు, ఉద్యోగుల రాకపోకల కోసం రెండు ఎలక్ట్రిక్ బగ్గీల కొనుగోలు చేసేందుకు రూ.15 లక్షలు, తిరుపతిలోని రాస్ (రాష్ట్రీయ సేవా సమితి) పరిధిలోని మహిళల స్వయం ఉపాధికి అవసరమైన కుట్టు మిషన్ల కోసం మరో రూ.15.03 లక్షల చెక్కును అందజేశారు.స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందించిన రూ.52 లక్షల సహకారాన్ని కేవలం ఒక విరా ళంగా చూడకూడదన్నారు స్విమ్స్ వీసీ డాక్టర్ జి.జగదీష్. ఇది చిన్నారుల ఆరోగ్యం, వారి ప్రాణరక్షణపై చేసిన మానవతా పెట్టుబడని ప్రశంసించారు. త్వరలో అత్యున్నత ప్రమాణాలతో పీఐసీయూను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఎంతోమంది ప్రజలకు ఉపయోగపడేలా సాయం చేసినందుకు ఎస్బీఐని అభినందించారు. కార్పొరేట్ సంస్థలు సీఎస్ఆర్ కింద ప్రజల కోసం నిధులు అందజేస్తుంటాయి.. స్విమ్స్, ఐఐటీ తిరుపతికి కూడా అలాగే విరాళాలు అందజేశారు. సీఎస్ఆర్ మాత్రమే కాదు తిరుమల శ్రీవారి భక్తులు, పలు సంస్థల నుంచి కూడా తిరుపతి స్విమ్స్కు విరాళాలు అందుతుంటాయి. అలాగే స్విమ్స్కు అవసరమైన వస్తువుల్ని కూడా కొంతమంది అందజేస్తుంటారు. గతంలో ఎంతోమంది స్విమ్స్కు అవసరమైన సాయం
చేశారు.