తమిళనాడు రాజకీయాలలోనూ, సినిమా వర్గాల్లోనూ తీవ్ర సంచలనం సృష్టిస్తున్న తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, త్రిషల వివాదంపై ప్రముఖ నటి సంజన గల్రానీ స్పందించారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలపై కొందరు చేస్తున్న రాజకీయ విమర్శలను ఆమె తీవ్రంగా ఖండించారు. ఈ క్రమంలో విజయ్, త్రిషలకు మద్దతుగా నిలుస్తూ ప్రత్యర్థులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సంగతి ఏంటంటే, ఇటీవల చెన్నైలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో నటి త్రిష ముందు వరుసలో ఆసీనులై సీఎం విజయ్కు సెల్యూట్ చేయడం రాజకీయ రచ్చకు దారితీసింది. దీనిపై కొన్ని రాజకీయ వర్గాలు మరియు పత్రికలు తీవ్ర విమర్శలు గుప్పించాయి. ఈ అంశంపై స్పందించిన సంజన గల్రానీ, విజయ్ రాజకీయంగా సాధిస్తున్న విజయాలు, ఆయన పాలనా తీరును తట్టుకోలేకనే ప్రత్యర్థులు ఆయన వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఒక మహిళను, అందునా సినీ ఇండస్ట్రీలో ఎంతో గౌరవం ఉన్న త్రిషను మధ్యలోకి లాగడం అత్యంత విచారకరమని సంజన పేర్కొన్నారు. "మీకు నిజంగా ధైర్యముంటే విజయ్ చేస్తున్న అభివృద్ధి, ఆయన పాలన, ప్రజా సంక్షేమ పథకాలపై మాట్లాడండి. అంతేకానీ ఆయన పనితీరుపై విమర్శలు చేయడానికి ఏమీ దొరకనప్పుడు, ఇలా ఒక మహిళను కేంద్రంగా చేసుకుని వ్యక్తిగత విమర్శలకు దిగడం సరైన పద్ధతి కాదు" అని హెచ్చరించారు. విజయ్ నాయకత్వ పటిమను కొనియాడిన సంజన, ఆయన ప్రజల సమస్యలపై వేగంగా స్పందిస్తున్న తీరు తమిళనాడులోనే కాకుండా దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోందని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఆయన బృందం వేగవంతమైన నిర్ణయాలు తీసుకుంటోందని, రాజకీయంగా ఆయనను ఎదుర్కొలేకే ఇటువంటి చౌకబారు విమర్శలు చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. త్రిష గురించి మాట్లాడుతూ, ఆమె తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును, గౌరవాన్ని సంపాదించుకున్న నటి అని కొనియాడారు. వారి వ్యక్తిగత జీవితం లేదా స్నేహం వారి వ్యక్తిగత నిర్ణయమని, దాని ఆధారంగా జడ్జ్ చేయడం ఏమాత్రం తగదని చెప్పారు. సమాజంలో