
ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా డాషింగ్ ఆటగాడు రిషభ్ పంత్ చరిత్ర సృష్టించాడు. భారత టెస్టు చరిత్రలో అరుదైన రికార్డు నెలకొల్పిన తొలి బ్యాటర్గా ఘనత సాధించాడు. ఇప్పటి వరకు ఎవరికీ సాధ్యం కాని ఫీట్ను ఖాతాలో వేసుకున్నాడు. అదేనండి.. టెస్టుల్లో భారత్ తరఫున శత సిక్స్ల వీరుడిగా నిలిచాడు. శ్రీలంకతో జరుగుతోన్న తొలి టెస్టులో పంత్ 66 పరుగులు చేశాడు. ఇందులో రెండు సిక్స్లు ఉన్నాయి. దీంతో 100 సిక్స్లు కొట్టిన తొలి భారత బ్యాటర్గా అవతరించాడు. అతడి తర్వాత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ (90), రోహిత్ శర్మ (88) ఉన్నారు. ప్రస్తుతం భారత్ తరఫున ఆడుతున్నవారిలో రవీంద్ర జడేజా (82) మాత్రమే కాస్త దగ్గరగా ఉన్నాడు. యువ ఆటగాళ్లు శుభ్మన్ గిల్ (47), యశస్వి జైస్వాల్ (45)కు ఈ మార్క్ను అందుకొనే అవకాశం ఉంది. అంతర్జాతీయంగా రిషభ్ పంత్ కంటే ముందు ముగ్గురు మాత్రమే ఈ ఫీట్ను సాధించారు. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ బెన్ స్టోక్స్ (122 టెస్టుల్లో 138 సిక్స్లు), బ్రెండన్ మెక్కల్లమ్ (101 మ్యాచుల్లో 108), ఆడమ్ గిల్క్రిస్ట్ (96 టెస్టుల్లో 100) వంద సిక్స్ల మైలురాయిని దాటారు. అత్యంత వేగంగా ఈ ఫీట్ను సాధించిన బ్యాటర్ మాత్రం రిషభ్ పంత్నే. అతడు కేవలం 51వ టెస్టుల్లోనే నమోదు చేశాడు. మున్ముందు మెక్కల్లమ్తోపాటు బెన్ స్టోక్స్ అత్యధిక సిక్స్ల రికార్డును పంత్ బద్దలు కొట్టేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. శ్రీలంకతో