Red Fort Vande Mataram : దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట ప్రాంగణం ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఒక అపూర్వమైన ఘట్టానికి సాక్ష్యంగా నిలవబోతోంది. భారతదేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవ సంబరాల్లో భాగంగా తొలిసారిగా జాతీయ గేయం 'వందేమాతరం'ను ఎర్రకోట వద్ద ఆలపించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటకు చేరుకునే సమయంలో ఈ గీతాలాపన జరుగుతుందని.. అనంతరం ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారని రక్షణ శాఖ వెల్లడించింది.150 ఏళ్ల ఘన చరిత్రకు నివాళి!ఈ వినూత్న నిర్ణయం వెనుక ఉన్న విశేషాలను రక్షణ కార్యదర్శి ఆర్.కె. సింగ్ వివరించారు. ప్రముఖ బెంగాలీ రచయిత బంకిం చంద్ర ఛటర్జీ రచించిన ‘వందేమాతరం’ గీతం రూపుదిద్దుకుని 2026 నాటికి సరిగ్గా 150 సంవత్సరాలు పూర్తి అవుతోంది. ఈ సందర్భంగా ఆ అమర గీత వారసత్వానికి, ప్రాముఖ్యతకు ఘన నివాళిగా ఎర్రకోట బురుజుల నుంచి దీనిని ఆలపించాలని నిర్ణయించారు. సాధారణంగా ఈ గేయంలోని మొదటి రెండు చరణాలను మాత్రమేఆలపించే సాంప్రదాయం ఉండేది. అయితే జాతీయ గీతం ‘జనగణమన’తో సమానంగా వందేమాతరానికి గౌరవం దక్కాలని, అందులోని మొత్తం ఆరు చరణాలను ఆలపించాలని కేంద్ర ప్రభుత్వం చాటి చెబుతోంది.ఇటీవలే వందేమాతరాన్ని అవమానించడాన్ని నేరంగా పరిగణిస్తూ పార్లమెంటు ఒక బిల్లును ఆమోదించింది. అలాగే ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల ప్రారంభంలో ప్రాధాన్యతగా వందేమాతరం పాటించాలని కేంద్రం ఆదేశించడమే కాకుండా పలు రాష్ట్రాలు పాఠశాలల్లో దీనిని నిర్బంధం చేశాయి. అయితే ఈ గీతంలోని కొన్ని చరణాలు తమ మత విశ్వాసాలకు విరుద్ధంగా ఉన్నాయని పేర్కొంటూ కొన్ని ముస్లిం సంస్థలు పూర్తి గీతాన్ని ఆలపించడంపై అభ్యంతరం వ్యక్తం చేశాయి.'వికసిత్ భారత్ 2047'.. యువతదే కీలక పాత్ర!2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడంలో యువత అందిస్తున్న సహకారాన్ని గౌరవిస్తూ ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవానికి ప్రత్యేక థీమ్ను ఖరారు చేశారు. ఇటీవల ప్రశ్నపత్రాల లీకేజీలపై జంతర్ మంతర్ వద్ద