
బ్యాంకుల నుంచి లోన్లు తీసుకున్నవారికి త్వరలో ఆర్బీఐ షాక్ ఇవ్వనుందా.. అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. రానున్న ద్రవ్య పరపతి విధాన సమీక్ష సమావేశాల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను పెంచే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు. అక్టోబర్, డిసెంబర్ సమీక్ష సమావేశాల్లో రెపో రేటు పెంపుపై ఆర్బీఐ నిర్ణయం తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. రాబోయే సమావేశాల్లో 25 బేసిస్ పాయింట్ల చొప్పున 50 బేసిస్ పాయింట్ల మేర రెపో రేటును పెంచే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. అక్టోబర్ సమావేశంలో 25 బేసిస్ పాయింట్లు, డిసెంబర్ సమావేశంలో మరో 25 బేపిస్ పాయింట్ల పెంచుతారని అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే లోన్లు తీసుకున్నవారికి షాకింగ్గా చెప్పవచ్చు.





