
పోలీసు అధికారి హత్య, హత్యాయత్నం, పోలీసు కస్టడీ నుంచి సంకెళ్లతో పరారీ వంటి తీవ్రమైన కేసుల్లో నిందితుడై, దాదాపు మూడు దశాబ్దాలుగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న మోస్ట్ వాంటెడ్ నేరస్థుడి కథకు ఎట్టకేలకు తెరపడింది. రాజేందర్ బైరాగి అలియాస్ రాజేందర్ సింగ్ యాదవ్ అలియాస్ 'డాక్టర్ ఝట్కా' (53)ను ఢిల్లీ పోలీస్ క్రైమ్ బ్రాంచ్ విభాగం శనివారం రాత్రి మధ్యప్రదేశ్లో అరెస్ట్ చేసింది. 28 ఏళ్ల సుదీర్ఘ వేట అనంతరం నిందితుడిని అశోక్నగర్ జిల్లా ముంగావలిలో పక్కా ప్రణాళికతో అదుపులోకి తీసుకున్నారు.1997లో ఢిల్లీలోని జనక్పురిలో జరిగిన కత్తుల దాడి, హత్యాయత్నం కేసులో రాజేందర్ బైరాగి పరారీలో ఉన్నాడు. ఈ కేసులో 2008లో రోహిణి కోర్టు అతడిని 'ప్రొక్లెయిమ్డ్ అఫెండర్'గా ప్రకటించింది. అప్పటి నుంచి ఈ కేసును ఛేదించేందుకు ప్రయత్నిస్తున్న ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ ప్రత్యేక బృందం, టెక్నికల్ సర్వైలెన్స్, డిజిటల్ ఫుట్ప్రింట్ల ఆధారంగా దర్యాప్తు చేపట్టింది. ఈ క్రమంలో నిందితుడు మధ్యప్రదేశ్లోని ముంగావలిలో పేరు మార్చుకుని నివసిస్తున్నట్లు కీలక సమాచారం లభించింది. దీంతో డీసీపీ చందర్ కుమార్ సింగ్ పర్యవేక్షణలో పోలీసులు దాడి చేసి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం స్థానిక కోర్టులో హాజరుపరిచి, ఢిల్లీకి తరలించేందుకు ట్రాన్సిట్ రిమాండ్ పొందారు.పోలీస్ అధికారి హత్య, సంకెళ్లతో పరారీవిచారణలో రాజేందర్ నేర చరిత్ర పోలీసులను ఆశ్చర్యపరిచింది. 1998 మే 10న హరియాణాలోని సోనిపట్ జిల్లాలో జరిగిన ఒక పెళ్లి వేడుకలో తన ముఠాతో కలిసి వివాదం సృష్టించి, విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో పెళ్లికూతురు బంధువు